మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. పురాణాల నేపథ్యంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి 500 కోట్లకి పైగా బడ్జెట్ అవసరం అని, అల్లు అర్జున్ సుబ్రమణ్య స్వామి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ కి మరోవైపు డైరెక్టర్ అట్లీతో కమిట్మెంట్ ఉంది.