‘వర్షం’తో యంగ్ రెబల్ స్టార్ సరసన నటించి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, క్రిష్ణ, బుజ్జిగాడు, కింగ్, నమో వెంకటేశా’ చిత్రాల్లో నటించి తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో టాలీవుడ్ కు త్రిష రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.