చిరంజీవి నుంచి సూర్య వరకు, 41 ఏళ్ళ వయసులో అందరినీ మాయ చేసిన హీరోయిన్.. 1200 కోట్ల బిజినెస్ ఆమె చేతిలోనే

Published : Jan 19, 2025, 09:24 AM IST

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో 40 ప్లస్ హీరోయిన్లు కూడా సత్తా చాటుతున్నారు. గతంలో 40 ప్లస్ హీరోయిన్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉండేవి. ఒక వేళ ఛాన్సులు వచ్చినా తల్లి, అత్త, సోదరి తరహా యాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేది.

PREV
15
చిరంజీవి నుంచి సూర్య వరకు, 41 ఏళ్ళ వయసులో అందరినీ మాయ చేసిన హీరోయిన్.. 1200 కోట్ల బిజినెస్ ఆమె చేతిలోనే

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో 40 ప్లస్ హీరోయిన్లు కూడా సత్తా చాటుతున్నారు. గతంలో 40 ప్లస్ హీరోయిన్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉండేవి. ఒక వేళ ఛాన్సులు వచ్చినా తల్లి, అత్త, సోదరి తరహా యాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేది. కానీ కొందరు సౌత్ హీరోయిన్లు నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతున్నారు. వారిలో ప్రధానంగా త్రిష గురించి చెప్పుకోవాలి. 

25

త్రిష వయసు ప్రస్తుతం 41 ఏళ్ళు. సాధారణంగా హీరోయిన్లు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు. ఆ తర్వాత సహజంగా కొత్త వాళ్ళ ప్రభావంతో జోరు తగ్గుతుంది. కానీ త్రిష అందుకు అతీతం. కెరీర్ ఆరంభంలో లాగే ఇప్పుడు కూడా దూసుకుపోతోంది. త్రిష జోరు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 2025 లో ఆమె చేతిలో 1200 కోట్ల బడ్జెట్ కలిగిన చిత్రాలు ఉన్నాయి. 

35
Trisha

చిరంజీవి, అజిత్, సూర్య ఇలా క్రేజీ హీరోల సరసన ఆమె నటిస్తోంది. ఈ ఏడాది రాబోతున్న త్రిష తొలి చిత్రం విడాముయార్చి. అజిత్ నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో పట్టుదల అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

45

అజిత్ తోనే త్రిష నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగులో త్రిష నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా దాదాపు 18 ఏళ్ళ తర్వాత త్రిష ఈ చిత్రంలో నటిస్తోంది. విశ్వంభర చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ 225 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

55

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రంలో త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా సూర్య 45వ చిత్రంలో కూడా త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మోహన్ లాల్ నటిస్తున్న రామ్ చిత్రంలో కూడా త్రిష నటిస్తోంది. సూర్య 45 వ చిత్రం 150 కోట్ల బడ్జెట్ లో, రామ్ మూవీ 150 కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రాల మొత్తం బడ్జెట్ 1200 కోట్లు దాటిపోతోంది. సౌత్ 40 ప్లస్ ఏజ్ లో ఇలాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రస్తుతం ఇంకెవరూ లేరు. 

Read more Photos on
click me!

Recommended Stories