ఆదిపురుష్ : చరిత్రలో నిలిచిపోతుందనుకున్న ఆదిపురుష్ చిత్రం తీవ్రంగా విమర్శల పాలైంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ జానకిగా నటించిన ఈ మూవీని డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. పౌరాణిక చిత్రం పైగా ప్రభాస్ పాత్రకి సరిపోయే పాత్ర కావడంతో ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓం రౌత్ డైరెక్షన్ వల్ల ఆదిపురుష్ చిత్రంపై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. సీతాదేవిగా నటించిన కృతి సనన్ కూడా ఆ రోల్ కి ఫిట్ కాదు అనే విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఆదిపురుష్ ఫ్లాప్ మూవీగా నిలిచింది.