ఎన్టీఆర్ నుంచి నితిన్ వరకు.. వెండితెరపై పరమభక్తులు!

First Published Jul 15, 2019, 10:18 AM IST

ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో టాలీవుడ్ లో ఎక్కువగా పౌరాణిక చిత్రాలు విడుదలయ్యేవి. కానీ ప్రస్తుతం పౌరాణిక చిత్రాలు తగ్గినా నాగార్జున, బాలయ్య లాంటి నటులు భక్తి రస చిత్రాల్లో నటిస్తున్నారు. వెండి తెరపై ఇప్పటివరకు పరమభక్తులుగా అలరించిన నటులు వీళ్ళే. 

పాండురంగ మహత్యం : ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 1957లో విడుదలయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆకతాయిగా తిరిగే వక్తి నుంచి పరమ భక్తుడిగా మారే కథ ఎమోషనల్ గా ఉంటుంది.
undefined
భక్త తుకారాం : ఏఎన్నార్ నటించిన ఈ భక్తి రస చిత్రం 1973లో విడుదలయింది.
undefined
భక్త కన్నప్ప : కృష్ణంరాజు కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం ఇది. ఈ చిత్రంలో కృష్ణంరాజు పరమశివుడి భక్తుడిగా అద్భుత నటన కనబరిచారు.
undefined
పాండురంగడు: తండ్రి ఎన్టీఆర్ తరహాలోనే బాలయ్య కూడా 'పాండురంగడు చిత్రంలో అదరగొట్టాడు.
undefined
అన్నమయ్య: రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో గొప్ప విజయం గా నిలిచిపోయింది. అన్నమయ్య పాత్రలో నాగార్జున ఒదిగిపోయాడు.
undefined
శ్రీమంజునాథ : అర్జున్, సౌందర్య నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి శివుడి పాత్రలో నటించారు. శివుడిని దూషించే అర్జున్ చివరకు ఆయనకే భక్తుడిగా మారతాడు.
undefined
అమ్మోరు : కోడి రామకృష్ణ గ్రాఫికల్ మ్యాజిక్ ఈ చిత్రం. ఇందులో సౌందర్య అమ్మవారికి భక్తురాలిగా నటించింది.
undefined
శ్రీరామదాసు : రాఘవేంద్ర రావు, నాగార్జున కలసి మరోసారి భక్తిరస చిత్రంతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున భక్త రామదాసుగా నటించాడు.
undefined
శ్రీఆంజనేయం: కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం ఇది. నితిన్ ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడిగా కనిపిస్తాడు.
undefined
భక్త ప్రహ్లాద : సీనియర్ నటి రోజా రమణి డెబ్యూ మూవీ ఇది. ఈ చిత్రంలో రోజా రమణి చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రహ్లాద పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు దక్కింది.
undefined
click me!