తిరుమల లడ్డు అపవిత్రం కావడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, అందుకు బాధ్యులను శిక్షించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు. విచారణ జరిపి తప్పు జరిగితే, నేరస్థులను శిక్షించండి, దేశవ్యాప్తంగా వివాదం రేపి, మతవిద్వేషాలు రెచ్చగొట్టటం ఎందుకు.. అనే అర్థంలో ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.