కాగా పూరి జగన్నాధ్ కి ఒక అలవాటు ఉంది. ఆయన కథలు రాసేందుకు బ్యాంకాక్ వెళతాడు. బ్యాంకాక్ మీకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఎందుకని అడగ్గా.. అక్కడ బీచ్ లో కూర్చుని నేను కథలు రాస్తాను.. అని పూరి జగన్నాధ్ సమాధానం చెప్పారు. ఇండియాలో బీచ్ లు ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో కూడా సముద్ర తీరాలు ఉన్నాయి. బ్యాంకాక్ మాత్రమే వెళ్ళడానికి రీజన్ ఏమిటని అడిగితే.
బ్యాంకాక్ కూడా కాదు పక్కనే ఉన్న పటాయా బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. బీచ్ పక్కనే రోడ్ ఉంటుంది. చక్కగా కుర్చీలు, గొడుగులు ఏర్పాటు చేస్తారు. హాయిగా కూర్చోవచ్చు. అక్కడ ఒక ముసలావిడ, ఆమె ఫ్యామిలీ ఉంటుంది. వాళ్లకు తెలుసు నాకు ఏం కావాలో? వాటర్, కొబ్బరి నీళ్లు సప్లై చేస్తుంటారు. ఆ ముసలావిడ ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. ఆ పటాయా బీచ్ లో కూర్చుని కథలు రాయడం అలవాటుగా మారింది.. అని వెల్లడించాడు.