జూ.ఎన్టీఆర్ బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా.. కీరవాణికి మాత్రమే తెలిసిన నిజం, మాట తీసుకున్న తారక్

First Published May 10, 2024, 7:36 PM IST

కీరవాణి ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీరవాణి సంగీతం అందించిన అద్భుతమైన చిత్రాల్లో మాతృదేవో భవ చిత్రం కూడా ఒకటి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. దేవర ఆగమనం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

కీరవాణి ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీరవాణి సంగీతం అందించిన అద్భుతమైన చిత్రాల్లో మాతృదేవో భవ చిత్రం కూడా ఒకటి. ఆ మూవీలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే సాంగ్ కీరవాణికి చాలా ఇష్టం అట. 

ఆ సాంగ్ ని ఒకసారి పాడండి అని యాంకర్ అడిగితే కీరవాణి తిరస్కరించారు. నేను ఆ పాట ఎక్కడ పడితే అక్కడ పాడను. ఎందుకంటే జూ. ఎన్టీఆర్ కి మాట ఇచ్చా. తారక్ కి కూడా అది చాలా ఇష్టమైన పాట. తాను బాధలో ఉన్నప్పుడు ఆ పాట వింటుంటానని తారక్ తనతో చెప్పినట్లు కీరవాణి అన్నారు. 

ఒకసారి తారక్ పుట్టినరోజున ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుండగా.. ఆ పాట గుర్తొచ్చింది. వేంటనే ఆ సాంగ్ ని నేను పాడి క్యాసెట్ లో రికార్డ్ చేసి తారక్ కి ఇచ్చా. అప్పుడు తారక్ నా దగ్గర మాట తీసుకున్నాడు. తాను ఉన్న చోట తప్ప ఇంకెక్కడా ఈ సాంగ్ పాడకూడదని అడిగాడు. బర్త్ డే రోజున తారక్ కోరడంతో మాట ఇచ్చేశా. కాబట్టి ఆ సాంగ్ ని తారక్ ఎదుట తప్ప ఇంకెక్కడా పాడను అని కీరవాణి అన్నారు.

చాలా కార్యక్రమాల్లో నన్ను మాతృదేవో భవ చిత్రంలో ఏ పాట పాడమని అడుగుతుంటారు. కానీ నేను ఒప్పుకోను అని కీరవాణి అన్నారు. కీరవాణి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, దమ్ము, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు వచ్చాయి. 

తాను సంగీతం అందించిన చిత్రాల్లో ఎక్కువ భాగం రాజమౌళి దర్శకత్వంలో చేసిన చిత్రాలంటేనే ఇష్టం అని కీరవాణి అన్నారు. ఇక ఇతర చిత్రాల విషయానికి వస్తే పెళ్లి సందడి, అన్నమయ్య లాంటి చిత్రాలు ఉన్నాయని తెలిపారు. 

click me!