ఆ తర్వాత ఏడాదికే దివ్య భారతి కన్నుమూసింది. ఆమె మరణం మిస్టరీగా మారింది. దివ్య భారతి తెలుగు, హిందీలోనే సినిమాలు చేసింది. తెలుగులో ఆమె `బొబ్బిలి రాజా`, `అసెంబ్లీ రౌడీ`, `రౌడీ అల్లుడు`, `ధర్మ క్షేత్రం`, `చిట్టెమ్మ మొగుడు`, `తొలిముద్దు` చిత్రాల్లో నటించింది. `తొలి ముద్దు` సమయంలోనే ఆమె మరణించింది. దీంతో ఆమె స్థానంలో రంభని తీసుకున్నారు. ఇక హిందీలో పదికిపైగా సినిమాలు చేసి మెప్పించింది. ఎవర్గ్రీన్ హీరోయిన్గా నిలిచింది దివ్య భారతి.