అట్లీ దర్శకత్వంలో 2017 దీపావళికి వచ్చిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో అదరగొట్టారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాలు మళ్లీ రిలీజ్ కావడం అభిమానులకు డబుల్ ట్రీట్' అని సినీ వర్గాలు అంటున్నాయి.