పక్క రాష్ట్రాల సిఫార్సుతో పద్మాలు దక్కించుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పద్మ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నది తమిళనాడు కోటా నుంచే. రాజమౌళికి పద్మశ్రీ కోసం కర్నాటక ప్రభుత్వం కృషి చేసింది. వీళ్లంతా మన తెలుగువాళ్లు. మన ప్రభుత్వాలు గౌరవించుకోవాల్సిన కళాకారులు. వాళ్లని మన ప్రభుత్వాలు విస్మరించారన్న విమర్షలు గట్టిగా వినిపిస్తున్నాయి.