దైవభక్తిని, దేశభక్తిని కూడా ప్రశాంత్ వర్మ చక్కగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అలాగే సైన్స్ ను కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. చిరుతపులితో పరిగెత్తడం, కొండను ఎత్తడం, హనుమాన్ భారీ విగ్రహం, వరలక్ష్మి మాస్ సీన్స్, బీజీఎం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్. 12 జనవరి 2024న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడు. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.గెటప్ శ్రీను, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.