పుట్టిన రోజు ప్రతి ఏడాది వస్తుంది, కానీ శతజయంతి ఒక్కసారే.. జూ.ఎన్టీఆర్ పై టిడి జనార్దన్ షాకింగ్ కామెంట్స్ 

Published : May 27, 2023, 07:20 PM IST

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. నందమూరి ఫ్యామిలిలో కొత్త వివాదానికి కేంద్రంగా మారినట్లు ఉన్నాయి. ఇప్పటికే నందమూరి అభిమానులు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేసుకుంటున్నారు.

PREV
16
పుట్టిన రోజు ప్రతి ఏడాది వస్తుంది, కానీ శతజయంతి ఒక్కసారే.. జూ.ఎన్టీఆర్ పై టిడి జనార్దన్ షాకింగ్ కామెంట్స్ 

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. నందమూరి ఫ్యామిలిలో కొత్త వివాదానికి కేంద్రంగా మారినట్లు ఉన్నాయి. ఇప్పటికే నందమూరి అభిమానులు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేసుకుంటున్నారు. గత నెలలో విజయవాడలో స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

26

ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్ లో కూడా గ్రాండ్ గా ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కానీ జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్టీఆర్ కి సరైన ఆహ్వానం అందిందా లేదా అనేది తారక్ ఫ్యాన్స్ అనుమానం. 

 

36

దీనిపై టిడిపి నేత ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్ని పర్యవేక్షించిన టిడి జనార్ధన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము జూ. ఎన్టీఆర్ ని ఆహ్వానించాం అని అయినా రాలేదు అని జనార్ధన్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ ని ఇన్వైట్ చేయాలని ప్రయత్నించాం. కానీ ఆయన వారం తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అయినా కూడా వెళ్లి ఆహ్వానించాం. 

46

కానీ ఆయనేమో తనకు ఆల్రెడీ ప్రోగ్రాం ఫిక్స్ అయింది అని అన్నారు. తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్ వెళుతున్నాం అని చెప్పారు. పుట్టినరోజులు ప్రతి ఏడాది వస్తాయి.. కానీ శతజయంతి ఒక్కసారే వస్తుందని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. మేం చెప్పాల్సింది చెప్పాం. కానీ చివరకు జూ. ఎన్టీఆర్ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ కి కూడా ట్రిప్ ఫిక్స్ అయిందేమో అని టిడి జనార్ధన్ పేర్కొన్నారు. 

56

జనార్దన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి నందమూరి అభిమానుల్లో కుంపటి పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే నందమూరి ఫ్యామిలిలో తారక్ కి సరైన ప్రాధాన్యత లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజకీయ ఉద్దేశంతోనే తారక్ ని దూరం పెడుతున్నారు అనే కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య ఫ్యాన్స్ అయితే ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. 

66

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ హాజరు కావడం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ ని ప్రశంసిస్తూ చరణ్ ప్రసంగించిన విధానం నందమూరి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. బాలయ్య చరణ్ ని రిసీవ్ చేసుకోవడం.. చంద్రబాబు తన పక్కనే కూర్చోబెట్టుకోవడం లాంటి దృశ్యాలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories