శ్రుతి హాసన్, వరలక్ష్మీ ఇప్పుడు ఐశ్వర్య, టాలీవుడ్ ను టార్గెట్ చేసిన తమిళ స్టార్ హీరోల కూతుళ్ళు

Published : May 19, 2022, 03:39 PM IST

మన టాలీవుడ్ లో నిహారికా, శివాని,శివాత్మిక లాంటి చాలా తక్కువమంది హీరోల వారసురాళ్లు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు.. వాళ్లు కూడా పెద్దగా మెరుపులు మెరిపించడం లేదు. కాని తమిళనాడులో మాత్రం స్టార్ సీరియర్ హీరోల తనయలు సిల్వర్ స్క్రీన్ పై తెగ హడావిడి చేస్తున్నారు. ఇటు టాలీవుడ్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు

PREV
17
శ్రుతి హాసన్, వరలక్ష్మీ ఇప్పుడు ఐశ్వర్య, టాలీవుడ్ ను టార్గెట్ చేసిన తమిళ స్టార్ హీరోల కూతుళ్ళు

కమల్ హాసన్, శరత్ కుమార్ సినీ వారసత్వాన్ని తీసుకుని.. స్టార్ డమ్ తో దూసుకుపోతున్నరు, తమిళ తెరపై వెలుగువెలిగిన తారలు.. టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూతురు కూడా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఆమె ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య. 

27

సౌత్ లో తిరుగులేని హీరోగా, యాక్షన్ కింగ్ ఇమేజ్ తో దూసుకుపోయిన అర్జున్ తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను తమిళంలో హీరోయిన్ గా పరిచయం చేశాడు. కాని అక్కడ పెద్దగా రాణించలేదు. హీరోయిన్ గా పెద్ద ఆఫర్లు కూడా రాలేదు. అయితే అటు తన మాతృ భాష కన్నడంలో తన కూతురితో స్వయంగా సినిమాను తీశాడు అర్జున్.  ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

37

తెలుగులో ఐశ్వర్య ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  ముఖ్యంగా ఈమూవీకి కథను పక్కాగా సెట్ చేశారటఅర్జున్. అంతే కాదు ఈ కథకు తగ్గట్టు హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది, అయితే డైరెక్టర్ ఎవరు అన్నవిషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. 

47

ఇక స్టార్ హీరోల వారసురాళ్ళలో టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్నది మాత్రం శృతీహాసన్ మాత్రమే. ముఖ్యంగా హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న శృతి హాసన్ కు టాలీవుడ్ లోసూపర్ హిట్ ఇచ్చి.. లక్కీ హీరోయిన్ గా మార్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

57

గబ్బర్ సింగ్ తరువాత వరుస సినిమాలు చేసి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది శృతిహాసన, ఆల్ మోస్ట్ తెలుగులో టాప్ హీరోలందరికి జోడీగా నటించింది. ఇక ఇప్పుడు కూడా ప్రభాస్ తో సలార్, బాలయ్యతో ఒక మూవీ.. మెగాస్టార్ చిరంజీవితో మరో మూవీ చేస్తోంది శ్రుతి హాసన్. కమల్ హాసన్ వారసురాలిగా వచ్చి.. టాలీవుడ్ లో కూడా సత్తా చూపించింది. 

67

ఇక టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న మరో స్టార్ హీరో వారసురాలు వరలక్ష్మీ శరత్ కుమార్. శరత్ కుమార్ సినిమా వారసత్వాన్ని తీసుకున్న ఆమె.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినా... ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వరలక్ష్మీ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేస్తోంది. ఇక్కడ కూడా స్టార్ డమ్ సంపాధిస్తోంది. 

77

ఇక చెన్నైలో సెటిల్ అయిన తెలుగు సినిమా ఫ్యామిలీకి చెందిన తార ఐశ్వర్య రాజేష్. అప్పటి హీరో రాజేష్ వారసురాలిగా తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయిన ఐశ్వర్య.. చిన్నగా టాలీవుడ్ లో కూడా సినిమాలు మొదలుపెట్టింది. గ్లామర్ తో కాకుండా యాక్టింగ్ స్కిల్స్ తో అవకాశాలు కొట్టేస్తోంది. ఇక్కడ వరుస సినిమాలు చేస్తోంది ఐశ్వర్య రాజేష్. ఇలా పక్క రాష్ట్రం నుంచి స్టార్ హీరోల వారసురాళ్లు మన టాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ.. పావులు కదుపుతున్నారు. 
 

click me!

Recommended Stories