దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), హీరో మహేశ్బాబు (Mahesh Babu)ల కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా చెప్పబడుతున్న ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో వేడుకగా జరిగినందని తెలుస్తోంది.
నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారు. చిత్ర టీమ్ తోపాటు మహేశ్బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా లాంఛ్కు సంబంధించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫొటోలు వెలువడలేదు. మరోవైపు, ఈ సినిమా ప్రారంభంపై మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.