Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌

Published : May 28, 2026, 10:02 PM ISTUpdated : May 28, 2026, 10:20 PM IST

Suriya: 'కరుప్పు' సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నటుడు సూర్య నటిస్తున్న తెలుగు మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'  విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

PREV
14
కరుప్పుతో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన సూర్య

సూర్యకి చాలా ఏళ్ల తర్వాత సరైన హిట్‌ పడింది. ఆయన రేంజ్‌కి సాలిడ్‌ హిట్‌ పడితే అది బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో ఇప్పుడు `కరుప్పు` మూవీ చూపిస్తోంది. సూర్య కెరీర్‌లో తొలిసారి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా ‘కరుప్పు’ నిలిచింది.  ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు రూ.269కోట్లు రాబట్టింది.  దీంతో సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు సూర్య. 

24
కరుప్పు కలెక్షన్లు

ఇప్పటి వరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.127కోట్లు రాబట్టింది. తెలుగులో దాదాపు రూ.28కోట్లు, కర్నాటకలో రూ.19కోట్లు, కేరళాలో రూ.12కోట్లు వసూలు చేసింది. నార్త్ ఇండియాలో మూడు కోట్లు, ఓవర్సీస్‌లో రూ,70కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇది రూ.270కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ వారంలో మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి. 

34
సూర్య తెలుగు సినిమా వస్తోంది

ఈ జోష్‌లో ఉన్న అభిమానులకు సూర్య మరో ట్రీట్‌ ఇవ్వబోతున్నాడు. కొత్త సినిమాతో అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన తెలుగు సినిమా రిలీజ్‌ కి రెడీ అయ్యింది. సూర్య తదుపరి సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. `రక్తచరిత్ర` తర్వాత సూర్య నటించిన తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం.  ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్లు, తర్వాత టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఆ టీజర్‌లో సినిమా జులైలో వస్తుందని చెప్పారు.

44
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ రిలీజ్‌ డేట్‌

అయితే ఇప్పుడు కథలో ఒక ట్విస్ట్. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను ఆగస్టుకు వాయిదా వేశారు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సూర్య విదేశీ వీధుల్లో గొడుగు పట్టుకుని, ఫోన్ చూస్తూ స్టైలిష్‌గా కనిపించారు. 'కరుప్పు' ఫీవర్ ఇంకా తగ్గకముందే, సూర్య తర్వాతి సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'కరుప్పు' లాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి దర్శకుడు వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డే కారణం. ఆయన గత చిత్రాలు 'సార్‌', 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories