ఇదిలా ఉంటే తాజాగా ఆమె జనాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. హోలీ పండుగ రోజు సుప్రియ అభిమానులకు, జనాలకు సారీ చెప్పడం విశేషం. మరి ఆమె ఏం తప్పు చేసింది? ఎందుకు సారీ చెప్పిందనేది చూస్తే, చాలా మంది సెలబ్రిటీలు ఇన్ఫ్లూయెన్సర్స్ గా మారి బెట్టింగ్ యాప్లను ఎంకరేజ్ చేశారు.
డబ్బుల కోసం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చే చాలా యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాటిలో చాలా వరకు మోసాలే ఉంటున్నాయి. చాలా మంది అమాయకులు ఆ యాప్లు చేసే ఫ్రాడ్కి మోసపోతున్నారు. ఇలాంటి సెలబ్రిటీలు చేసే యాడ్స్ ని జనాలు ఫాలో అవుతుంటారు. అంతిమంగా మోసపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు చాలా పెరిగిపోతున్నాయి.