Mahesh Babu: దుబాయ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో జాయిన్ అయిన స్టార్ డైరెక్టర్

First Published Dec 31, 2021, 10:41 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) అండ్ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్ లో జరుపుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్యామిలీతో కలిసి మహేష్ ప్యామిలీ దుబాయ్ లో సందడి చేస్తున్నారు.

టైమ్ దొరికితే చాలు విదేశాలకు వెళ్తుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu)  అండ్ ఫ్యామిలీ. ఇక రీసెంట్ గా మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగడంతో దుబాయ్ లో రెస్ట్  తీసుకుంటున్నారు. సర్జరీ తరువాత కంప్లీట్ గా కోలుకున్న మహేష్ .. ఫెష్టివల్ సెలబ్రేషన్స్ కోసం.. ఫ్యామిలీతో దుబాయ్ లోనే ఉన్నారు. అక్కడ షాపింగ్స్ చేసుకుంటూ.. రెస్టారెంట్లకు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక వీరితో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం.. ఫ్యామిలీ తో సహా జాయిన్ అయ్యారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally). వీరంతా కలిసి దుబాయ్ లోని వరల్డ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా దగ్గర సందడిచేశారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ హడావిడిచేశారు. రెండు రోజుల ముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను స్టార్ట్ చేసిన స్టార్స్ ఫ్యామిలీతో దుబాయ్ అంతా చుట్టేస్తన్నారు. బుర్జ్ ఖలీఫా మీద సూపర్ స్టార్ మహేష్ , నమ్రతతో పాటు, గౌతమ్,సితార అటు వంశీ పైడిపల్లి, ఆయన భార్య,కూతురు ఉన్నారు. వీరంతా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ ప్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. రెండు ఫ్యామిలీలు చాలా సందర్భాల్లో కలిసి ఫారెన్ టూర్లకు వెళ్ళారు. అటు మహేష్ బాబు గారాల కూతురు సితార తో కలిసి వంశీ పైడిపల్లి కూతురు యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు. వీరిద్దరు సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడిచేస్తూనే ఉంటారు. సూపర్ స్టార్ తో మహర్షి సినిమా చేశారు వంశీ పైడిపల్లి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. అప్పటి నుంచి ఈవీరు ఫ్యామిల ఫ్రెండ్స్ గా మారిపోయారు.

మహేష్ సర్జరీ తరువాత దుబాయ్ చేరిన ఫ్యామిలీ అక్కడే క్రిస్ మస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. పైగా దుబాయ్ లో ఎప్పటి నుంచో నమ్రత సోధరి ఫ్యామిలీతో ఉంటున్నారు. దాంతో అన్నీ కలిసి వచ్చేలా టూర్ ను ప్లాన్ చేసుకున్నారు నమ్రత. దీనికి సంబంధించిన పిక్స్ ను కూడా నమ్రత సోషల్ మీడియాలో శేర్ చేశారు. అందరూ కలిసి క్రిస్ మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్న తరువాత రెగ్యూలర్ వర్క్ లోకి దిగబోతున్నారు సూపర్ స్టార్ .

దుబాయ్ లో సెలబ్రేష్స్ అయిపోయిన తరువాత సూపర్ స్టార్ తన షూటింగ్ షెడ్యూల్స్ లో జాయిన్ కాబోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు. మైత్రీమేకర్స్ తో కలిసి సూపర్ స్టార్ ఈ సిమాను నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈలోపు మహేష్ కాలికి సర్జరీ అవ్వడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ 2న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్. నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ ను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

click me!