వద్దురా అంటే వినలేదు, తండ్రిని భయపెట్టిన మహేష్ బాబు.. ఈ టైంలో కృష్ణ గారు ఉండి ఉంటే..

Published : Jan 18, 2025, 10:48 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి చిత్రం గుంటూరు కారం. గత ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలైంది. ఇక ఈ ఏడాది మహేష్ నుంచి ఎలాంటి సినిమా ఉండదు. ఎందుకంటే రీసెంట్ గానే రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రం మొదలైంది. 

PREV
14
వద్దురా అంటే వినలేదు, తండ్రిని భయపెట్టిన మహేష్ బాబు.. ఈ టైంలో కృష్ణ గారు ఉండి ఉంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి చిత్రం గుంటూరు కారం. గత ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలైంది. ఇక ఈ ఏడాది మహేష్ నుంచి ఎలాంటి సినిమా ఉండదు. ఎందుకంటే రీసెంట్ గానే రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రం మొదలైంది. పూజా కార్యక్రమాలతో  చిత్రాన్ని లాంచ్ చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. 

 

24

రాజమౌళి సినిమా అంటే పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ఇండియా సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతున్న చిత్రం ఇది. సుమారు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి షూటింగ్ పూర్తి చేయడానికి మినిమమ్ ఏడాదిన్నర సమయం పడుతుంది. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

 

34

అటవీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం, పైగా రాజమౌళి దర్శకత్వం అంటే యాక్షన్ స్టంట్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మహేష్ బాబు దాదాపుగా అన్ని చిత్రాలు వీలైనంత వరకు రియల్ స్టంట్స్ చేస్తుంటారు. మహేష్ బాబు రియల్ స్టంట్స్ చేస్తుంటే సూపర్ స్టార్ కృష్ణ తండ్రిగా చాలా భయపడేవారట. టక్కరి దొంగ చిత్రంలో మహేష్ బాబు ట్రైన్ లో వేలాడడం, బ్రిడ్జ్ పై వేలాడడం లాంటివి రియల్ గా చేశారట. ఎంత వద్దని చెప్పినా మహేష్ బాబు వినలేదని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 

 

44

కృష్ణ కామెంట్స్ పై అభిమానులు తాజాగా స్పందిస్తున్నారు. ఇప్పుడు కనుక కృష్ణ గారు ఉండి ఉంటే రాజమౌళి చిత్రం చూసి ఇంకెంత టెన్షన్ పడేవారో అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అటవీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి చాలా స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమా అంటే ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి. మహేష్  బాబుకి తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ మూవీ ఇది. 

 

click me!

Recommended Stories