అసలు నరేష్ ఎవరు ?..మా ఫ్యామిలీతో సంబంధమే లేదు అంటూ సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు కామెంట్స్

First Published May 28, 2023, 10:20 AM IST

తాజాగా నరేష్, పవిత్ర పై సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Naresh babu

విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరి నెగిటివ్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు.. నరేష్ పవిత్ర లతో మళ్ళీ పెళ్లి అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. 

అయితే నరేష్, పవిత్రల వ్యవహారం.. రమ్య రఘుపతితో గొడవలు రోత పుట్టించే స్థాయిలో మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దీనితో ఫ్యామిలీ గుట్టు రచ్చకెక్కింది. నరేష్, పవిత్రపై తీవ్రంగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయితే వాటితో తమకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా నరేష్, పవిత్ర లైఫ్ కొనసాగిస్తున్నారు. 

తాజాగా నరేష్, పవిత్ర పై సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కృష్ణ గారు మరణించినప్పుడు అక్కడ ఎవరూ లేకుండా పార్థివ దేహాన్ని ఒంటరిగా ఉంచారని రమ్య రఘుపతి.. నరేష్ పై కామెంట్స్ చేస్తూ వీడియో లీక్ చేసిన సంగతి తెలిసిందే. 

దీనితో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. అక్కడ ఎవరూ ఎందుకు లేరు.. మా అబ్బాయి, అల్లుడు అంతా ఉన్నాం. మహేష్ బాబు అప్పటి వరకు ఉంది కాస్త విశ్రాంతి కోసం వెళ్లారు. అంత మాత్రాన ఎవరూ లేనట్లా అని ప్రశ్నించారు. నరేష్ గారిని నిందిస్తూ ఆమె వీడియో పెట్టారు కదా అని యాంకర్ ప్రశ్నించగా.. అసలు నరేష్ ఎవరు ? వాళ్ళ వ్యవహారాలు మేము పట్టించుకోము అంటూ ఆది శేషగిరి రావు కుండ బద్దలు కొట్టేశారు. 

Naresh

నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి గురించి వస్తున్న వార్తలని తాము పట్టించుకోము అని అన్నారు. అలాగే ఆస్తి విషయంలో కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. విజయనిర్మల నుంచి కృష్ణ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అప్పుడే ఎవరి ఆస్తి వాళ్లకు పంచారు. అలాగే విజయనిర్మలకి కూడానా కృష్ణగారు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదని ఆదిశేషగిరి రావు అన్నారు. 

Naresh

ఆ మధ్యన నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్రతో తన బంధాన్ని మహేష్ బాబు యాక్సెప్ట్ చేసారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఆదిశేషగిరి రావు చెసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

click me!