ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు.
ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) , స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.