ఎస్ఎస్ఎంబి 29 కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మహేష్

Published : Jan 02, 2025, 02:01 PM ISTUpdated : Jan 02, 2025, 02:28 PM IST

రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు ఏళ్లుగా పాటిస్తున్న ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడనేది లేటెస్ట్ న్యూస్. ఈ మేరకు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.   

PREV
16
ఎస్ఎస్ఎంబి 29 కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మహేష్

ఎట్టకేలకు రాజమౌళి-మహేష్ బాబు మూవీకి తొలి అడుగు పడింది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ పూజా కార్యక్రమం నేడు మొదలైంది. హంగు ఆర్భాటాలు  లేకుండా హైదరాబాద్ శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబి 29 పూజా సెరిమోని ఏర్పాటు చేశారు. కాగా ఎస్ఎస్ఎంబి 29 చిత్రం కోసం ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని మహేష్ బాబు   బ్రేక్ చేశాడు అనేది తాజా వార్త. 

26

మహేష్ బాబుకు సెంటిమెంట్స్ ఎక్కువ. టైటిల్స్ విషయంలో మరింత పర్టిక్యులర్ గా ఉండేవారు. మురారి మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు అనంతరం మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. ఒక్కడు, అతడు, అర్జున్, పోకిరి, దూకుడు, అతిథి, ఖలేజా, ఆగడు... ఇలా అనేక చిత్రాలు మూడు అక్షరాల టైటిల్స్ తో మహేష్ బాబు చేశారు. వీటిలో ఒక్కడు, పోకిరి, దూకుడు ఇండస్ట్రీ హిట్స్ గా ఉన్నాయి. 

36
ssmb 29

మహేష్ బాబు పెట్టుకున్న మరొక సెంటిమెంట్, ఆయన తన కొత్త చిత్రాల పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. మహేష్ బాబుకు బదులు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, కుటుంబ సభ్యులు హాజరవుతారు. కారణం ఏదైనా... లేటెస్ట్ మూవీ పూజా సెరిమోనికి హాజరు కాకూడదనే సెంటిమెంట్ ని మహేష్ బాబు ఫాలో అవుతున్నాడు. అయితే ఎస్ఎస్ఎంబి 29 కోసం ఈ సెంటిమెంట్ బ్రేక్ చేశాడట మహేష్ బాబు. 

 

46

జనవరి 2న ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. నిరాడంబరంగా హైదరాబాద్ నగర శివారులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారు. మహేష్ బాబు కారు రావడం వీడియోలో రికార్డు అయ్యింది. రాజమౌళి ఒత్తిడి కారణంగా మహేష్ బాబు తన సెంటిమెంట్ పక్కన పెట్టి పూజా కార్యక్రమానికి హాజరయ్యారనే ఊహాగానాలు మొదలయ్యాయి. నమ్రతతో పాటు కుటుంబ సభ్యులు సైతం వేడుకలలో పాల్గొన్నారు. వెంటనే షూటింగ్ సైతం ఆరంభం కానుందట. రెండు మూడు రోజుల వ్యవధిలో విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన సెట్ లో మొదటి షెడ్యూల్ జరగనుందట. 

56

ఇక పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కించనున్నారు. బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు అట. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి పని చేయనున్నట్లు సమాచారం. 

SSMB 29: 1000 కోట్ల బడ్జెట్, రాజమౌళి, మహేష్ వాటా ఎంతో తెలుసా.. అంతర్జాతీయ ఒప్పందాలు ఇవే ?

 

66
SSMB 29

కాగా రాజమౌళి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత లేదు. అధికారికంగా ఎస్ఎస్ఎంబి 29పై రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజమౌళితో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు అంతే. మీడియా సమావేశంలో పాల్గొని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పలు సందర్భాల్లో అనధికారికంగా మూవీపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 

click me!

Recommended Stories