స్టార్స్ కొడుకుల కంటే స్టార్స్ కూతుళ్లపై ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వారిని చూసేందుకు అభిమానులు, ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఎలా ఉన్నారు, వారి స్టయిల్, వారి నడవడిక, వారి లుక్, అందం ఇలా ప్రతి విషయాన్ని చర్చనీయాంశం చేస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఇంకా వీటికి సంబంధించిన చర్చ మరింత ఎక్కువగా మారింది. అందులో భాగంగా శ్రీకాంత్ కూతురు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
ఫ్యామిలీ స్టార్గా పేరుతెచ్చుకున్నారు శ్రీకాంత్. ఇప్పుడు ఓ వైపు కీలక పాత్రలతోపాటు, మెయిన్ లీడ్గానూ చేస్తున్నారు. తరచూ ఆయన తిరుమలలో సందడి చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
తన భార్య ఊహా, కొడుకు రోషన్, కూతురు మేధలతోపాటు చిన్న కొడుకుతో కలిసి లేటెస్ట్ గా తిరుమలలో సందడి చేశారు. అయితే ఇందులో అందరి చూపు కూతురు మేధపై పడటం విశేషం. ఆమె చాలా పింక్ శారీలో మెరిసింది. నాజుగ్గా ఉంది. స్లిమ్ లుక్లో హీరోయిన్ని తలపిస్తుంది.
దీనికితోడు ఆమె సొట్టబుగ్గలు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్యూట్ అందాలతో కనువిందు చేస్తుంది. అమాయకపు చూపులతో కట్టిపడేస్తుంది. తిరుమలలో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది.
ఇక శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి తిరుమలకి రావడంతో మీడియా సైతం వారిని బంధించేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మేధని కెమెరాలో బంధించారు. ఆమెకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు.
అలా ఇప్పుడు శ్రీకాంత్, ఊహాల కూతురు మేధల పింక్ శారీలోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె క్యూట్ అందాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కుర్రాళ్లని ఆకర్షిస్తున్నాయి.
అయితే చూడ్డానికి శ్రీకాంత్ కూతురు హీరోయిన్ని తలపిస్తుంది. ఇంకా చెప్పాలంటే వారిని మించిన ఉంది. దీంతో టాలీవుడ్లోకి మరో తెలుగు అమ్మాయి రాబోతుందని, స్టార్ వారసురాలు రాబోతుందని అంటున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు.
శ్రీకాంత్ ఫ్యామిలీ విషయాలను చాలా వరకు ప్రైవేట్గానే ఉంచుతారు. పెద్ద కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేశాడు. ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ కూతురు మేధ, చిన్న కొడుకుని మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉంచబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూతురిని మాత్రం సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో లేనట్టు సమాచారం.