శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తెలుగు ఎంట్రీ దాదాపు ఖరారే?..దెయ్యంగా భయపెడుతున్న ఈ అందాల భామ

First Published Feb 17, 2021, 11:08 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి తనయు జాన్వీ కపూర్‌త తెలుగు ఎంట్రీ దాదాపు ఖరారుగానే కనిపిస్తుంది. ఇన్నాళ్లకు ఓ సినిమా ఫిక్స్ అయ్యిందని, క్రియేటివ్‌ డైరెక్టర్‌ దొరికేశాడని తెలుస్తుంది. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్‌. మరోవైపు జాన్వీ దెయ్యంగా మారింది. భయబ్రాంతులకు గురి చేస్తుంది. 
 

శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్‌కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ వచ్చింది. ఎంట్రీతోనే తన వారసత్వాన్ని పునికి పుచ్చుకుంది జాన్వీ. శ్రీదేవి అకాల మరణంతో ఆమెపై ఉన్న అభిమానం మొత్తం జాన్వీ వైపు మళ్లింది.
undefined
జాన్వీని తెలుగులో పరిచయం చేయాలనేది ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ ఆకాంక్ష. శ్రీదేవి తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. స్టార్‌ హీరోలను మించిన స్టార్‌డమ్‌తో టాలీవుడ్‌ని కొన్నాళ్లపాటు శాషించారు.
undefined
దీంతో శ్రీదేవిపై ఇంకా అభిమానం ఉంది. దాన్ని క్యాష్‌ చేసుకుని తన కూతురుని తెలుగులో రాణింప చేయాలని భావిస్తున్నారు బోనీ కపూర్‌. గతేడాది నుంచి తెలుగులో ఎంట్రీకి సంబంధించి కసరత్తులు చేస్తున్నారు.
undefined
విజయ్‌ దేవరకొండ `లైగర్‌` సినిమాలో అనుకున్నారు, ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలోనూ జాన్వీ పేరు వినిపించింది. అలాగే మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా అంటూ వార్తలొచ్చాయి. కానీ అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి.
undefined
ఇప్పుడు సరైనా లాంఛ్‌ దొరికిందట. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ డైరెక్షన్‌లో జాన్వీని తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయాలని భావిస్తున్నారట బోనీ కపూర్‌.
undefined
కృష్ణవంశీ ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్ర కథని సిద్ధం చేశారు. జాన్వీకి అది బాగా సూట్‌ అవుతుందని, ఆమెని సంప్రదించారని, దీనిపై బోనీ కపూర్‌ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉందని సమాచారం.
undefined
అక్కడినుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే ఇక జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయినట్టే అని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయింట్‌ చేయాల్సిందే.
undefined
ఇదిలా ఉటే కృష్ణ వంవీ తెలుగులో తెరకెక్కించిన `అంతఃపురం` చిత్రాన్ని హిందీలో బోనీ కపూర్‌ `శక్తిః ది పవర్‌` పేరుతో నిర్మించిన విషయం తెలిసిందే.
undefined
ప్రస్తుతం జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో `గుడ్‌ లక్‌ జెర్రీ`, `రూహి`, `దోస్తానా2` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో హర్రర్‌ ఎంటర్‌ టైనర్‌ `రూహి` సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.
undefined
ఆద్యంతం హర్రర్‌ కామెడీ ఎలిమెంట్స్ తో సాగే ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. చాలా గ్యాప్‌తో బాలీవుడ్‌లో మరో హర్రర్‌ సినిమా వస్తుందని చెప్పొచ్చు.
undefined
ఇందులో జాన్వీ కపూర్‌ దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపిస్తుంది. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తున్నారు.
undefined
ఓ అడవిలో ఉన్న పాత బంగ్లాలో వీరిద్దరి మధ్య వచ్చేసన్నివేశాలు ఆద్యంతం భయపెట్టడమే కాదు, నవ్వులు పూయిస్తున్నాయి.
undefined
ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌ని సంపాదించడం విశేషం. దానికంతా కారణంగా జాన్వీ క్రేజే అని టాక్‌.
undefined
మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.
undefined
click me!