శ్రీదేవి నుంచి ఐశ్వర్య వరకు.. తండ్రి తనయులతో ఆడిపాడిన కథానాయికలు..

First Published Dec 3, 2020, 4:00 PM IST

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల విషయంలో అరుదైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. తండ్రితో ఆడిపాడిన హీరోయిన్లు ఆ తర్వాత కొడుకుతోనూ స్టెప్పులేయాల్సి వస్తుంటుంది. బాలీవుడ్‌లో శ్రీదేవి, రేఖ, హేమా మాలిని, మాధురీ దీక్షిత్‌, రాణిముఖర్జీ, ఐశ్వర్య రాయ్‌ వంటి కథానాయికలు తండ్రీ తనయులతో ఆడిపాడారు. 

మొదటగా చెప్పాల్సి వస్తే, అతిలోకి సుందరి శ్రీదేవి ఇందులో ముందుంటారు. ఆమె రెండు తరహాల హీరోలతో నటించి మెప్పించింది. ఆమె ధర్మేంద్రతో కలిసి `బండి`, `ఫరిస్తయ్‌`, `సోనె పే సుహాగా`లతో కలిసి రొమాన్స్ చేసింది. ఆ తర్వాత ఆయన తనయుడు సన్నీ డియోల్‌తో కలిసి `నిగహెన్‌`, `చాల్‌ బాజ్‌` చిత్రాల్లో ఆడిపాడింది.
undefined
డ్రీమ్‌ గర్ల్ హేమా మాలిని సైతం తండ్రి తనయులతో మెస్మరైజ్‌ చేసింది. రాజ్‌ కపూర్‌తో ఆమె `సప్నో కా సాడ్‌గర్‌`లో నటించింది. ఆయన తనయుడు రణ్‌దీర్‌ కపూర్‌తో `హాత్‌ కి సఫాయి` చిత్రంలో మంత్రముగ్ధుల్ని చేసింది.
undefined
మరో అందాల తార రేఖ సైతం రెండు తరాల హీరోలతో ఆడిపాడింది. ఆమె హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌తో `ఖూమ్‌ భరి మాంగ్‌`, `ఖూబ్‌సురట్‌`, `బహురాణి` చిత్రాల్లో స్టెప్పులేయగా, ఆయన తనయుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి `కోయి మిల్‌ గయా`, `క్రిష్‌` చిత్రాల్లో నటించింది.
undefined
మరో బాలీవుడ్‌ అలనాటి హాట్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌ రిషి కపూర్‌తో `యారానా`, `ప్రేమ్‌ గ్రాంగ్‌` చిత్రాల్లో కలిసి నటించింది. రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన `హే జవాని హై దీవానీ` చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో ఆడిపాడి అందాలతో కనువిందు చేసింది.
undefined
రాణిముఖర్జీ.. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి `బ్లాక్‌, `కభీ ఖుషి కభీ ఘమ్‌` చిత్రాల్లో రొమాన్స్ చేయగా, అభిషేక్‌ బచ్చన్‌ సరసన `యువ`, `కభీ అల్విదా నా కెహ్నా` చిత్రాల్లో మెస్మరైజ్‌ చేసింది. అంతేకాదు `బంటీ ఔర్‌ బబ్లీ` చిత్రంలో ఇద్దరితోనూ ఆడిపాడింది.
undefined
ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ సైతం ఇద్దరితోనూతో ఆడిపాడింది. `బంటీ ఔర్‌ బబ్లీ` చిత్రంలో ఓ ఐటెమ్‌ సాంగ్‌లో అటు అమితాబ్‌ బచ్చన్‌తో, అభిషేక్‌ బచ్చన్‌తో స్టెప్పులేసి కనువిందు చేసింది.
undefined
click me!