1972లో జన్మించిన సౌందర్య.. 1993లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ పరంగా `మనవరాలి పెళ్లి` ఆమె తొలి చిత్రం. తర్వాత `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు`, `అల్లరి ప్రేమికుడు`, `మేడం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్రబంధం`, `అంతపురం`, `రాజా`, `చూడాలని వుంది`, `శ్రీ రాములయ్య`, `అన్నయ్య`, `రవన్న`, `అజాద్`, `దేవి పుత్రుడు`, `ఎదురులేని మనిషి, `సీతయ్య`, `స్వేతనాగు` వంటి చిత్రాలు చేసింది. చివరగా ఆమె `శివశంకర్` చిత్రంలో నటించారు. `నర్తనశాల` లేట్గా రిలీజ్ అయ్యింది.