సౌందర్య కన్నడ అమ్మాయి అయినా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగమ్మాయి అనిపించింది. ఆమె కట్టు, బొట్టు తెలుగు దనాన్ని ఉట్టిపడేలా చేశాయి. అయితే ఆమె తెలుగులో ఎక్కువగా ఇద్దరు ముగ్గురు హీరోలతోనే చేసింది. అందులో వెంకటేష్, జగపతిబాబు ఉన్నారు. వీరితోనే ఏకంగా ఐదారు మూవీస్ చేసింది. వీరితోపాటు చిరు, బాలయ్య, నాగ్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, మోహన్బాబు వంటి వారితోనూ కలిసి నటించి, ఆకట్టుకుంది సౌందర్య.