టాలీవుడ్‌లో మరో వేడుక.. సిరివెన్నెల తనయుడి నిశ్చితార్థం

First Published Aug 17, 2020, 9:29 AM IST

ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. లాక్‌ డౌన్‌ సమయంలోనే నిఖిల్, నితిన్‌, రానా, దిల్ రాజులు పెళ్లి చేసుకోగా మెగా డాటర్‌ నిశిత్చార్థ వేడుక కూడా ఇటీవలే కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో టాలీవుడ్ నటుడు కూడా చేరాడు.

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు రాజా చెంబోలు నిశ్చితార్థం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. ఆదివారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు రాజా.
undefined
రాజా హీరోగా వెండితెరకు పరిచయం అయినా తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్‌ అయ్యారు. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్‌, ఫిదా, ఎవడు లాంటి సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు రాజా. తాజా వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన రాజాకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశాస్తున్నారు.
undefined
undefined
undefined
undefined
click me!