కీర్తిసురేష్‌ కొత్త సినిమా.. బందిపోటు అవతారం..!

First Published Aug 16, 2020, 2:55 PM IST

గ్లామర్‌కి అతీతంగా రాణిస్తోంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. `మహానటి`తో ఒక్కసారి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది. ఇక ఆ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని జాతీయ స్టాయి హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల ఎంపికలతో తన పంథానే మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్న కీర్తిసురేష్‌ తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మలయాళంలో `సాని కాయిదమ్‌ట్విట్టర్‌ ద్వారా ప్రకటిస్తూ, చిత్రపోస్టర్‌ని పంచుకుంది. ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇందులో కీర్తిసురేష్‌, మరో మేల్‌ పాత్రధారి వెనకాల తిరిగి ఉన్నారు. చేతిలో తుపాకీ, వీపువెనక కత్తి పెట్టుకుని నిలబడి ఉన్నారు. ఎదురుగా కారు రక్తం మరకలతో ఉండగా, దానికి అటూ ఇటూ కొంత మంది నిల్చొని ఉన్నారు. పోస్టర్‌ చూస్తుంటే అందులో కీర్తిబందిపోటు తరహా పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. అరుణ్‌ మాదేశ్వరన్‌ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
undefined
ఈ సినిమా గురించి కీర్తి ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. `నా నెక్ట్స్ సినిమా అరుణ్‌మాదేశ్వరన్‌ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసితెరని పంచుకోవడం సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉంది` అని కీర్తి తెలిపింది. దీంతో ఆమెకి సినీ తారలు అభినందనలు చెబుతున్నారు.
undefined
ఇక ప్రస్తుతం కీర్తి చేతిలో ఐదు సినిమాలున్నాయి. అందులో ఒకటి రజనీకాంత్‌ `అన్నాత్తె` కావడం విశేషం. ఇందులో మీనా, ఖుష్బు, నయనతార వంటి భారీ తారాగణంనటిస్తుంది. శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంతో కీర్తికిదే తొలిసారి కావడం విశేషం.
undefined
దీంతోపాటు మలయాళంలో మోహన్‌లాల్‌ సరసన `మరక్కర్‌ః అరేబియన్‌ సింహం`చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో విభిన్నమైన పాత్రలో ఆమె కనువిందుచేయబోతుంది. పీరియడ్‌ డ్రామాగా ప్రియదర్శన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఇది తెలుగులోనూ విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
మరోవైపు తెలుగులో ఆమె లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మిస్‌ ఇండియా`లో నటిస్తుంది. నాగేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇదొక మోడ్రన్‌ కల్చర్‌ నేపథ్యంలో రొమాంటిక్‌డ్రామాగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. దీన్ని మహేష్‌ కోనేరు నిర్మాత. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
undefined
ఇక ట్రైలింగ్వల్‌ చిత్రం `గుడ్‌ లక్‌ సఖీ` సైతం ఆసక్తికరంగా ఉండబోతుంది. జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు నగేస్‌ కుకునూర్‌ దీన్నిరూపొందిస్తున్నారు. ఇటీవల ప్రభాస్‌విడుదల చేసిన చిత్ర టీజర్‌ అంచనాలను పెంచుతుంది. ఇందులో ఆదివాసి అమ్మాయిగా కీర్తి పాత్రలో ఒదిగిన తీరుకి శెభాష్‌ అనాల్సిందే. ఇందులో ఆమె షూటర్‌గాకనిపించనుంది. ఆదిపినిశెట్టి హీరోగా నటిస్తున్నారు.
undefined
నితిన్‌తో ఓ రొమాంటిక్‌ అండ్‌ క్యూట్‌ లవ్‌స్టోరీ చేస్తుంది కీర్తి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ ఆద్యంతం అలరించింది. సోమొత్తంగా కీర్తిసురేష్‌ చేస్తున్నసినిమాలన్నీ దేనికదే భిన్నమైనవి కావడం విశేషం. కెరీర్ ప్రారంభంలోనే ఇంతటి భిన్నమైన సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా కూడా కీర్తి తనస్పెషాలిటీని చాటుకుంటున్నారు.
undefined
click me!