డిజిటల్ ఎంట్రీకి సిద్ధం అవుతున్న సింగర్ సునీత... అనూహ్యంగా డేరింగ్ స్టెప్!

First Published Jun 30, 2021, 8:07 AM IST


మన జీవితాలను నిర్ణయించేది నిర్ణయాలే... రైట్ టైం లో రైట్ డెసిషన్ జీవితాన్ని మార్చి వేస్తుంది. అలాంటి నిర్ణయమే తీసుకున్నారు సింగర్ సునీత. మొదటి భర్తతో విభేదాలు కారణంగా విడిపోయిన సునీత చాలా కాలంగా పిల్లలతో కలిసి ఒంటరి జీవితం గడుపుతున్నారు. 

ఈ క్రమంలో తన చిరకాల మిత్రుడు మ్యాంగో అధినేత రామ్, సునీతకు పెళ్లి ప్రపోజల్ పెట్టడం జరిగింది. రామ్ గురించి తెలిసిన సునీత అతనితో వివాహానికి ఒప్పుకుంది. పిల్లలతో పాటు తన భవిష్యత్ కోసం రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేశారు.
undefined
2021 జనవరిలో సునీత రామ్ వివాహం ఘనంగా జరిగింది. చిత్ర ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు, సునీత మిత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు. రామ్ కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
undefined
ఇక పెళ్ళైన నాటి నుండి సింగర్ సునీత ఓ కొత్త జీవితం అనుభవిస్తున్నారు. రామ్ తో సాంగత్యం ఆమె ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలుస్తుంది.
undefined
ఒక దశలో సునీత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట. పిల్లల భవిష్యత్ గురించి ఆమె చాలా బాధపడ్డారట. ఇప్పుడు ఆమెకు అలాంటి చింత లేదు. పెళ్లి తరువాత ఆమె కెరీర్ కూడా ఊపందుకుంది. సింగర్ గానే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో ఆమె జడ్జిగా కనిపిస్తున్నారు.
undefined
ఐకానిక్ మ్యూజిక్ షో పాడుతా తీయగా కొత్త సీజన్ కి సునీత జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ షోలో బాలుగారి కుమారుడైన ఎస్పీ చరణ్ సైతం మరో జడ్జిగా పాల్గొనడం విశేషం. కాగా మరో కొత్త రంగంలోకి సునీత అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
సునీత భర్త రామ్ సహకారంతో నిర్మాతగా మారనున్నారట. డిజిటల్ కంటెంట్ విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో సునీత వెబ్ సిరీస్ లు , సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారట.
undefined
దీనిపై సునీత కసరత్తు మొదలుపెట్టగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మీడియా, ఎంటర్టైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న రామ్ నేతృత్వంలో వెబ్ సిరీస్ లు నిర్మించాలని అనుకుంటున్నారట. నిర్మాతగా ఉన్న సునీత ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
undefined
click me!