సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సింగర్గా, టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో అభిమానులతో ముచ్చటిస్తుంది. వారికి కావాల్సిన పాటలు పాడుతూ అలరిస్తుంది.
undefined
అందులో భాగంగా తాజా లైవ్లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. అందులో భాగంగా తన గాయం సీక్రెట్ని రివీల్ చేసింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆడుకుంటుండగా తలకి గాయమైందని, నుదుటిపై నాలుగు కుట్లు పడ్డాయని పేర్కొంది. బట్ చిన్నప్పటికీ సంబంధించి అదొక మధుర జ్ఞాపకమని వెల్లడించింది.
undefined
తనకి `అమ్మ` అనే పదం వింటే కన్నీళ్లు వస్తాయని చెప్పింది సునీత. అద్భుతమైన పదమని, అమ్మ ఒక్కతే అమ్మ కాదు, సృష్టిలో మనకు ఇచ్చే ప్రతి ఒక్కటి అమ్మే అని తెలిపింది. తల్లిగా ఉండటం గొప్ప అనుభూతి అని, ఈ జీవితానికి అంతకంటే ఏం అవసరం లేదని తెలిపింది. మదర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెబుతూ, స్త్రీలను గౌరవించడం, ఇంట్లో అమ్మని బాగా చూసుకోవడమే అమ్మకి ఇచ్చే గొప్ప బహుమతి అని తెలిపింది.
undefined
తాను ఫస్ట్ టైమ్ టీవీ షో చేస్తున్నానని, మంచి ఎక్స్ పీరియెన్స్ నిస్తుందని చెప్పింది. `డ్రామా జూనియర్స్`కి జడ్జ్ గా చేస్తున్నట్టు తెలిపింది. చిన్న చిన్న పిల్లలు ఎంతో ప్రతిభతో ఉన్నారని, వారిని చూస్తుంటే ముచ్చటేస్తుందని పేర్కొంది.
undefined
ఈ సందర్భంగా సునీత అభిమానికి క్షమాపణలు చెప్పింది. ఎందుకంటే అతను సునీత వాట్సాప్ నెంబర్ అడిగారు. దీంతో సారీ అని చెప్పింది. ఇక ఆద్యంతం పాటలతో సాగిన సునీత లైవ్ ఛాట్ శ్రోతలను, నెటిజన్లని ఒలలాడించిందని చెప్పొచ్చు. ఇకపై ప్రతి రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు లైవ్ ఛాట్ చేస్తానని, పాటలు పాడతానని తెలిపింది సునీత.
undefined
సింగర్ సునీత ఈ ఏడాది జనవరిలో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. డిజిటల్ రంగానికి చెందిన రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ చాలా బ్యూటీఫుల్గా ఉందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది. పిల్లలిద్దరు బాగున్నారని తెలిపింది. చివరగా కరోనా జాగ్రత్తలు తెలిపారు.
undefined