పాడుతా తీయగా షోలో చీకటి కోణం
ప్రస్తుతం ఈ షోలో కీరవాణి, సునీత, చంద్రబోస్ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సీరీస్ లో తనకి అన్యాయం జరిగింది అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రవస్తి.. జడ్జీలు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న చీకటి కోణాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా కీరవాణి, చంద్రబోస్, సునీతపై విమర్శలు చేసింది.