బాలుగారికి 'కరోనా'కి కారణం నేను కాదు, సైబర్ కేసు పెడతా!
First Published Aug 21, 2020, 10:29 AM ISTతెలుగు పరిశ్రమలో కరోనా వైరస్ ధడ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన కొంత మంది ప్రముఖులు పడగా తాజాగా టాలీవుడ్ సింగర్స్ సునీత,మాళవిక, ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందులోనే వారికి కరోనా సోకినట్టుగా సమాచారం. ప్రస్తుతం వీరు హోం క్వారంటైన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా సోకటానికి మాళవిక కారణం అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మాళవిక కాస్త సీరియస్ గానే స్పందించారు. ఆ వివరాలు చూద్దాం.