గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఉప్పల్ లో మొక్కలునాటిన గాయని మధుప్రియ

First Published Jun 18, 2020, 10:04 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇవాళ ఉప్పల్ లో టాలీవుడ్ సింగర్ మధుప్రియ మూడు మొక్కలు నాటారు. 

హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ గాయని మధుప్రియ స్వీకరించారు. మొదటి రెండు విడతలు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఛాలెంజ్ మూడో విడత ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాయని మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి ఈ రోజు ఉప్పల్ లో మూడు మొక్కలను నాటారు.
undefined
ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ...ఎంపీ సంతోషన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ... అందులో నాలాంటి వారందరిని భాగస్వామ్యం చేస్తునందుకు సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
undefined
మొక్కల్ని నాటడం... అలాగే నాటిన ప్రతీ మొక్కని కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాక్షిస్తున్నట్లు మధుప్రియ తెలిపారు.
undefined
ఈ సందర్బంగా మధుప్రియ మరియ కార్పొరేటర్ గోపు సరస్వతి మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు.తెలంగాణ మొదటి మహిళా పైలట్ సంజన, జీహెచ్ఎంసీ ఉప్పల్ కమిషనర్ అరుణకుమారి అలాగే నటుడు మధులకు ఛాలెంజ్ విసిరారు.
undefined
click me!