తండ్రి-తల్లి విడిపోవడం వారి వ్యక్తిగత సంతోషం కోసం తీసుకున్న నిర్ణయం, దానిని నేను గౌరవిస్తానని చెప్పింది శృతి హాసన్. పేరెంట్స్ విడిపోయినా, వారిద్దరితోనూ మంచి రిలేషన్ కొనసాగిస్తుంది. తరచూ తండ్రి కమల్ తో దిగిన ఫోటోలను పంచుకుంటుంది శృతి.
శృతి హాసన్ చివరగా తెలుగులో `సలార్`లో నటించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ లో ప్రభాస్ హీరోగా నటించారు. దీనికి సీక్వెల్ `సలార్ 2` రానుంది. ఇందులో శృతి హాసన్ పాత్ర మెయిన్గా ఉండబోతుందట. ప్రస్తుతం `కూలీ`, `ట్రైన్`, `జన నాయగన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది శృతి హాసన్.