పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఇంటి సభ్యులు ఆల్రెడీ పసిగట్టారు. అతనికి జనాల్లో ఉన్న సింపథీ పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ వీక్ నామిషన్స్ లో అమర్ దీప్ చౌదరి, రితికా రోజ్, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు మరికొందరు అతనిపై దాడి చేశారు. సింపథీ డైలాగ్స్ కొట్టొద్దని హెచ్చరించారు. అయినా అతని మేనియా తగ్గకపోగా పెరిగిందని సమాచారం.