హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ మూడేళ్ల క్రితమే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఆమె బాలీవుడ్లో విజయం సాధించిన `టూస్టేట్స్` చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. అడవి శేష్ హీరో.
undefined
నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాల్సి ఉంది. గ్రాండ్గా ఓపెనింగ్ కూడా జరిగింది. కొంత భాగం షూటింగ్ తర్వాత సినిమా ఆగిపోయింది. కథ విషయంలో తేడా రావడం, అడవిశేషు కొన్ని అభ్యంతరాలు చెప్పడం వంటి కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి.
undefined
దాన్నుంచి బయట పడి కెరీర్ని ఫ్రెష్గా లాంచ్ చేయాలని భావించింది శివానీ. ఇటీవల ఆమె తన కొత్త సినిమాలను ప్రకటించింది. `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`, `అద్భుతం`తోపాటు ఓ తమిళ సినిమాని బర్త్ డే సందర్భంగా ప్రకటించింది.
undefined
అయితే ఇప్పుడు మరో సినిమా ఆగిపోయిందనే వార్త టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. యంగ్ హీరో తేజ సజ్జా, శివానీ జంటగా నటించబోతున్న `అద్భుతం` చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు ఊపందుకున్నాయి.
undefined
కొత్త దర్శకుడు మాలిక్ రామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుందట. దాదాపు 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న విధంగా అవుట్ పుట్ రావడం లేదని మేకర్స్ పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.
undefined
దీంతో శివానీకి ఆరంభ అడ్డంకులు వెంటాడుతున్నాయని, ఐరన్ లెగ్ అనే ముద్ర అప్పుడే వేయించుకోవాల్సి వస్తుందా? అని కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆగిపోయిందా లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్ లో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
undefined
ఇదిలా ఉంటే తన సిస్టర్ శివాత్మిక మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె `దొరసాని`తో మెప్పించింది. ఇప్పుడు `పంచతంత్రం`, `రంగమార్తాండ`తోపాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.
undefined
ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జెట్ స్పీడ్తో వెళ్తుంటే, అక్కకి మాత్రం ఇలా జరగడంపై రాజశేఖర్ ఫ్యామిలీ మదనపడుతున్నారట.
undefined
చెల్లి వరుస ఆఫర్లతో దంచికొడుతుంటే, అక్క మాత్రం వరుస సినిమాలు ఆగిపోతూ తలపట్టుకుంటుందట.
undefined