శిల్పాశెట్టి సంచలన నిర్ణయం.. రాజ్‌కుంద్రా ఇంటి నుంచి బయటకు.. బ్రేకప్‌ చెప్పబోతుందా?

First Published Aug 30, 2021, 9:53 PM IST

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి సంచలన నిర్ణయం తీసుకుందా? ఇన్నాళ్లు మానసిక వేదన అనుభవించిన శిల్పాశెట్టి ఇక తన రిలేషన్‌కి బ్రేకప్‌ చెప్పాలనుకుంటుందా? ప్రస్తుతం బాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ఆ న్యూస్‌ లో నిజమెంతా?

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా గత నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. బెయిల్‌ కోసం మూడు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే రాజ్‌కుంద్రా చేసిన పనికి శిల్పాశెట్టి పరువు మొత్తం పోయింది. 
 

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా, డాన్స్ రియాలిటీ షోకి జడ్జ్ గా, యోగా టీచర్‌గా, పర్సనాలిటీ మోటివేటర్‌గా ఉన్న శిల్పాశెట్టి భర్త ఇలా చేశారనే ఆరోపణలు ఆమె ఇమేజ్‌ మొత్తాన్ని డ్యామేజ్‌ చేశారు. ఆమెపై, ఆమె ఫ్యామిలీపై అనేక ఆరోపణలు వచ్చాయి. అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలను తట్టుకోలేక ఏకంగా శిల్పాశెట్టి కోర్ట్ ని కూడా ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసుకుంది. తమ పరువుని బజారున వేయకండి అంటూ ఓ నోట్‌ ని విడుదల చేసింది. 

నెల రోజులపాటు మానసికంగా ఎంతో సవాళ్లని ఎదుర్కొన్నట్టు తెలిపింది. దాన్నుంచి బయటపడేందుకు మళ్లీ తాను డాన్స్ షోకి జడ్జ్గ్‌ గా వచ్చినట్టు పేర్కొంది. దీన్ని చాలా మంది స్వాగతించారు. కానీ రాజ్‌కుంద్రాపై ఆరోపణల విషయంలో శిల్పాశెట్టి మాత్రం తలెత్తుకోలేకపోతుంది. తనకు ప్రమేయం లేకుండా తాను బలి కావాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుందనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో కోడై కూస్తుంది.

శిల్పా పిల్లలతో రాజ్ కుంద్రా ఇంటి నుండి బయటకి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అస్లీల చిత్రాల కేసు నేప‌థ్యంలో భర్త రాజ్‌కుంద్రా ఆర్థిక విషయాలకు కూడా దూరంగా ఉంటుందని తెలుస్తుంది. భ‌ర్త రాజ్‌కుంద్రాతో విడిపోయి త‌న పిల్ల‌ల‌తో క‌లిసి విడిగా బ్రతికేందుకు సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పిల్లలతో సహా రాజ్ కుంద్రా ఇంటి నుండి తన తల్లి వద్దకు వెళ్లినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. 

శిల్పాశెట్టి స్నేహితురాలు ఒకరి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, వారిద్ద‌రి మ‌ధ్య స‌మ‌స్య‌ల‌ను త‌క్కువ చేసి చూపాల్సిందేమీ లేద‌ని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం బ‌య‌ట‌ప‌డటంతో శిల్పాశెట్టి షాక్‌కు గుర‌య్యార‌ని క‌థ‌నం ఉండగా.. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, స్టేటస్ లు కూడా అది నిజమేనని నిరూపించాయి. 

భర్త అక్రమ మార్గంలో వ‌జ్రాలు, డ్యూప్లెక్స్ ఇండ్లు సంపాదించార‌న్న సంగ‌తి ఆమెకు ఇన్నాళ్లు తెలియకపోగా.. తెలిసిన తర్వాత ఇప్పుడు ఆమె అవి స్వీకరించేందుకు సిద్ధంగా లేదని చెప్పుకుంటున్నారు. మరోవైపు మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ కేసు విచారణ వరకు రాజ్‌కుంద్రా ఫ్యామిలీకి దూరంగా ఉంటుందా? లేక జీవితాంత దూరంగా ఉండాలని నిర్ణయించుకుందా? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.
 

click me!