కోలీవుడ్ ప్రముఖ నటిగా కొనసాగుతున్న షీలా రాజ్ కుమార్ నేడు ఫ్యాన్స్ కి షాకిచ్చే ప్రకటన చేసింది. తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. షీలా 2014లో చోళన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.
ఆమె భర్త తంబీ చోళన్ యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది ఫ్యాన్స్ కి షాకింగ్ గా మారింది. ఓ షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తున్న సమయంలో షీలా, చోళన్ మధ్య పరిచయం ఏర్పడింది.
అయితే షీలా, చోళన్ పెళ్ళికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఫ్యామిలీ అంగీకరించకపోయినా సినిమాటిక్ స్టైల్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సముద్రం మధ్యలో వీళ్లిద్దరి పెళ్లి మధుర జ్ఞాపకంలా జరిగింది.
షీలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నేను వైవాహిక జీవితాన్ని వదిలేస్తున్నాను. ధన్యవాదాలు మరియు ప్రేమ చోళన్ అంటూ షాకింగ్ ట్వీట్ చేసింది. ఒకవైపు ధన్యవాదాలు, ప్రేమ అంటూనే విడాకులు ఏంటి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అనేది అంతు చిక్కని ప్రశ్న. షీలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె బిచ్చగాడు 2, నూడిల్స్, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాల్లో నటించింది. బిచ్చగాడు 2లో విజయ్ ఆంటోని చెల్లి పాత్రలో షీలా మెరిసింది.
ద్రౌపది, టూలెట్, మండేలా లాంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. అదే విధంగా జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ పెటైకాలిలో ఎద్దుని పెంచే మహిళగా నటించింది.