షారూఖ్‌ ఢిల్లీ హోమ్ గౌరీ రీడిజైన్‌‌.. లగ్జరీకి కేరాఫ్‌.. చూస్తే వాహ్‌ అనాల్సిందే!

First Published Nov 19, 2020, 9:21 AM IST

షారూఖ్‌కి బాలీవుడ్‌లోనే అత్యంత సంపన్నమైన స్టార్‌ అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఢిల్లీలోనూ ఓ ఖరీదైన ఇళ్లు ఉంది. తాజాగా దాన్ని రీ డిజైన్‌ చేశారు. సరికొత్తగా, లగ్జరీగా ఉన్న ఆ ఇంటి ఫోటోలను పంచుకుంది షారూఖ్‌ భార్య గౌరీ ఖాన్‌. 

బాలీవుడ్‌ బాద్‌షా ఢిల్లీలో పుట్టి పెరిగారు. చదువుల్లో చురుకుగా ఉండే షారూఖ్‌ ఫ్యామిలీ అప్పట్లోనే వ్యాపారాలు చేసేవారు.
undefined
ఉన్నత విద్య కూడా షారూఖ్‌ ఢిల్లీలోనే పూర్తి చేశారు. ఆయన భార్య గౌరీ ఖాన్‌ కూడా ఢిల్లీకి చెందిన అమ్మాయే కావడం విశేషం. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
undefined
పెళ్లైన కొత్తలో ఢిల్లీలోని ఈ ఇంట్లోనే ఉండేవారు షారూఖ్‌, గౌరీఖాన్‌. కొన్నాళ్ల తర్వాత ముంబాయికి మారిపోయారు. బాలీవుడ్‌లో హీరో రాణించి ఇప్పుడు తిరుగులేని స్టార్‌అయ్యారు షారూఖ్‌.
undefined
అయితే ఇప్పుడు ఢిల్లీ హౌజ్‌ని పూర్తిగా మాడిఫై చేశారు. గౌరీ ఖాన్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌. తాను స్వతహాగా ఢిల్లీ హౌజ్‌కి కొత్త హంగులు అద్దారు. అందంగా ముస్తాబు చేశారు.అంతేకాదు లగ్జరీగా డిజైన్‌ చేశారు.
undefined
తాజాగా ఆ ఇంట్లోని అందాలను చూపిస్తూ, దాన్ని ఆస్వాధిస్తూ ఫోటోలను, వీడియోని పంచుకుంది గౌరీ ఖాన్. ఆ ఇంట్లో గడిపిన గౌరీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీనికి`ఎయిర్‌బీఎన్‌బీ` అనే పేరుని పెట్టారు.
undefined
కోట్ల విలువ కలిగిన ఈ `ఎయిర్‌బీఎన్‌బీ`కి సంబంధించిన వీడియోని పంచుకుంటూ, `మా ఢిల్లీ ఇళ్ళు ప్రారంభంలో అనేక మెమరీస్‌తో నిండిపోయింది. ఇందులో చాలాసంవత్సరాలుగా సేకరించిన మధుర జ్ఞాపకాలను ఉంచినట్టు పేర్కొంది.
undefined
అంతేకాదు ఈ ఇళ్ళు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిందని, ఇందులో ఉండటాన్ని, ఈ ఇంటిన కలిగి ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు షారూఖ్‌, గౌరీఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు.
undefined
ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఈ ఇంటిని చూసి ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. షారూఖ్‌, గౌరీల టేస్ట్ కి తగ్గట్టగా ఈ ఇళ్లు ఉందని చెబుతున్నారు.
undefined
ఢిల్లీ హౌజ్‌లో ఉన్నప్పటి ఫోటోలను చూసి ఆనందిస్తున్న గౌరీ ఖాన్.
undefined
షారూఖ్‌, గౌరీలకు మొత్తం దాదాపు 4500కోట్ల ఆస్తులున్నట్టు సమాచారం. అందులోనూ ఢిల్లీ హౌజ్‌ ప్రత్యేక స్థానం సంపాదించిందని చెప్పొచ్చు.
undefined
రెండేళ్ళ సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన షారూఖ్‌ ఇప్పుడు `పఠాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్‌ సిద్ధార్థ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనెహీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. జాన్‌ అబ్రహం విలన్‌గా కనిపించబోతున్నారు.
undefined
click me!