షారుఖ్ ఖాన్ ఐకానిక్ ఇల్లు 'మన్నత్'కు మరమ్మతులు చేస్తున్నారు. ఇంటికి కొత్తగా ఫ్లోర్లు యాడ్ చేస్తున్నారని తెలిసింది. ఈ పనుల కోసం షారుఖ్ తాత్కాలికంగా పాలి హిల్కు మారడం కూడా హాట్ టాపిక్ అయింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఐకానిక్ ఇల్లు 'మన్నత్'కు ఇప్పుడు భారీగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ ఇంటి వెనుక భాగంలో మరికొన్ని ఫ్లోర్లు నిర్మిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ డెవలపర్, నిర్మాత ఆనంద్ పండిట్ తాజాగా రవి కేవల్రమణి పాడ్కాస్ట్లో చెప్పారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం, పండిట్కు చెందిన శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియాల్టీ సంస్థ ఈ పనులు చేస్తోంది. దాదాపు రూ.300 కోట్ల విలువైన ఈ ఇల్లు ఇప్పుడు మరింత పెద్దదిగా మారబోతోంది. తమ సంస్థ బాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలతో పనిచేస్తుందని కూడా పండిట్ తెలిపారు.
23
ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత కొన్న మొదటి ఇల్లు
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ఆనంద్ పండిట్ మరో ఆసక్తికర విషయం పంచుకున్నారు. గతంలో కార్టర్ రోడ్లోని శ్రీ అమృత్ సొసైటీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్పై ఆయన పనిచేశారు. అయితే ఆ భవనంతో షారుఖ్కు ఉన్న సంబంధం అప్పుడు ఆయనకు తెలియదు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత తాను కొన్న మొదటి ఇల్లు అదేనని షారుఖ్ తర్వాత పండిట్కు చెప్పారట. ఆ ప్రాజెక్ట్ను లోటస్ డెవలపర్స్కే ఇప్పించాలని షారుఖ్ సొసైటీ ఛైర్పర్సన్తో కూడా మాట్లాడాలనుకున్నారట. షారుఖ్ తొలి ఇల్లు కావడంతో ఆ ప్రాజెక్ట్ తనకు మరింత ప్రత్యేకమని పండిట్ అన్నారు.
33
'మన్నత్'లో మరమ్మతుల పనులు
'మన్నత్'లో మరమ్మతుల పనులు మొదలవడంతో, షారుఖ్ ఖాన్, ఆయన కుటుంబం ఏప్రిల్ 2025లో తాత్కాలికంగా ఇల్లు మారారు. బాంద్రాలోని పాలి హిల్లో ఉన్న 'పూజా కాసా' అనే లగ్జరీ అపార్ట్మెంట్కు షిఫ్ట్ అయ్యారు. షారుఖ్ ఇమేజ్లో 'మన్నత్' ఎంత కీలకమో ఈ మార్పు తెలియజేస్తోంది. ఏళ్ల తరబడి ఇది అభిమానులకు ఓ యాత్రాస్థలంలా మారింది. ఈద్, షారుఖ్ పుట్టినరోజున వేలాది మంది అభిమానులు బ్యాండ్స్టాండ్ దగ్గర గుమిగూడి తమ హీరోను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. రోజూ కనీసం 200-300 మంది సందర్శకులు 'మన్నత్'ను చూసేందుకు వస్తుంటారు. ఇప్పుడు కొత్త ఫ్లోర్లు యాడ్ చేస్తుండటంతో, ఈ ఐకానిక్ ఇల్లు మరింత విశాలంగా మారనుంది.