ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకుందామనుకున్న ఎన్టీఆర్... మరి ఆ వివాహం ఆగిపోవడానికి కారణం ఏమిటీ!

First Published Aug 19, 2022, 12:00 PM IST

దేవుడిగా పూజించే ఎన్టీఆర్ జీవితంలో కూడా కొన్ని వ్యక్తిగత వివాదాలున్నాయి. 63 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకోవడం అత్యంత వివాదాస్పదమైంది. ఈ కారణంగానే ఎన్టీఆర్ ని కుటుంబ సభ్యులు దూరం పెట్టడం, అనంతరం పదవీ వియోగం, ఆ వేదనతో మరణం సంభవించాయి.

NTR

అయితే లక్ష్మీపార్వతి కంటే ముందు ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ కృష్ణకుమారిని వివాహం చేసుకోవాలి అనుకున్నారు. దాదాపు పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట అనూహ్యంగా విడిపోవడం జరిగింది. ఆ జనరేషన్ కి మాత్రమే తెలిసిన ఎన్టీఆర్-కృష్ణకుమారి ప్రేమ, పెళ్లి వ్యవహారంపై ఆమె సిస్టర్ షావుకారు జానకి స్పందించారు. ఎన్టీఆర్-కృష్ణకుమారి బంధం గురించి ఆమెకు తెలిసిన నిజాలు వెల్లడించారు.

NTR

కృష్ణకుమారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఎన్టీఆర్ ని నేను నిలదీశాను, తిట్టానని ప్రచారమైన దాంట్లో నిజం లేదు. ఆయనంటే నాకు విపరీతమైన గౌరవం ఉండేది. అలాగే ఆయన కూడా నన్ను అభిమానించేవారు. అలాగే కృష్ణకుమారి నా సిస్టర్ అయినప్పటికీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోము.  ఎన్టీఆర్,కృష్ణకుమారి వివాహం చేసుకోబుతున్నారనే ప్రచారం మాత్రం విపరీతంగా జరిగింది.  
 

NTR


ఓ సందర్భంలో మాత్రం మాట్లాడుకున్నాము. ఎన్టీఆర్ తో పెళ్లి అంత శ్రేయస్కరం కాదని సలహా ఇచ్చాను. ఎందుకంటే ఆయనకు 12 మంది పిల్లలు. వాళ్ళు కూడా అదో టైపు. ఎన్టీఆర్ ని వివాహం చేసుకుంటే నీ భవిష్యత్తు బాగోదని చెప్పాను, అని షావుకారు జానకి అన్నారు. 
 

NTR

ఆమె ఇంకా మాట్లాడుతూ... వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. కృష్ణకుమారి జీవితంలో విషాదం ఉంది. అందుకే కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో 17 సినిమాలు వదులుకుంది. వాటిలో ఓ ఐదారు సినిమాలు ఎన్టీఆర్ తో ఉంటాయి. వివాదం, మానసిక వేదన కారణంగానే కృష్ణకుమారి అలా చేసి ఉండవచ్చు. దాని గురించి కూడా నేను అడగలేదు.

NTR

ఇక అజయ్ కైతా తో వివాహం గురించి కూడా నాకు తెలియదు. జస్ట్ నాకు కార్డు పంపింది. ఈ వివాహం విషయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఓ టాప్ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి మీ సిస్టర్ ని ఈ వివాహం చేసుకోవద్దని చెప్పండి. అటు వైపు నుండి మాకు ఒత్తిడి వస్తుంది అన్నారు. దానికి నేను అది ఆమె వ్యక్తిగత విషయం, నేను చెప్పలేనని నిర్మొహమాటంగా చెప్పానని షావుకారు జానకి అన్నారు. 

కృష్ణకుమారి ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత రాంనాథ్ గోయంకా అల్లుడు అజయ్ కైతాను వివాహం చేసుకున్నారు. రాంనాథ్ గోయంకా కూతురుకి విడాకుల ఇచ్చిన తర్వాత కృష్ణకుమారిని వివాహం చేసుకొని బెంగుళూరులో సెటిల్ అయ్యారని షావుకారు జానకి తెలియజేశారు.

click me!