NTR Jayanthi: ఇడ్లీతో నాటుకోడి, యాపిల్ జూస్ సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సింది

First Published May 28, 2022, 8:44 AM IST

నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగాచెప్పేది ఏముంది. ఆయన నటన,రాజకీయ జీవితం గురించి తెలిసిందే.. కాని సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీకు తెలుసా.. ఆయన ఏది ఇష్టంగా తినేవారు అంటే..? 

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని శక్తిగా అవతరించి జనాలచేత దేవుడిగా కీర్తించబడ్డ వ్యక్తి ఎన్టీఆర్. సిద్థాంతాలకు మారు పేరుగా నిలిచిన ఎన్టీఆర్, షూటింగ్ టైమ్ తో పాటు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండేవారట. 

ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు సెట్ కు చేరుకునేవారట ఎన్టీఆర్. అంటే డైలీ నాలుగు గంటలకే నిద్రలేచి ఆయన దినచర్య స్టార్ట్ చేసేవారు. షూటింగ్స్, పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం రాజీ పడే వారు కాదట. 

ముఖ్యంగా అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట. ఇడ్లీతో నాటుకోడిని నంజుకోవడం అంటే పెద్దాయనకు ఎంతో ఇష్టమట. అయితే ఇరవై ఇడ్లీలు ఒకేసారి తినకుండా.. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు పది, పదిహేను ఇడ్లీలు తింటే… తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు 5,6 ఇడ్లీలు తినేవారట.

ఇకపోతే ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డాడట. ఒక రోజుకు మూడు షిఫ్ట్ ల చొప్పున పనిచేసేవారట. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొనేవారట. అంత బిజీ షెడ్యూల్ సమయంలో కూడా... షూటింగ్ గ్యాప్ లో ఫుడ్ గురించి డిస్కర్షన్స్ జరిగేవట.

పెద్దాయనకు  యాపిల్ జ్యూస్ అంటే ప్రాణం అంట.. ఆయన ఎక్కువగా ఆపిల్ జ్యూస్ తాగేవారట. మద్రాసులో ఉన్న టైమ్ లో  యాపిల్స్ ఎక్కువగా ఎక్కడ  బాగుంటాయో కనుక్కుని మరీ.. అక్కడి నుంచి తెప్పించుకునేవారట.
 

ఒక రోజుకు 3 నుంచి 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్ లో ఈ కోటా పెరిగేదట. ఎక్కడికి వెళ్ళినా.. ఎంత మారుమూల షూటింగ్ జరిగినే ఇవి మాత్రం తప్పకుండా తన వెంట ఉండాల్సిందే. 
 

ఇక సమ్మర్ వస్తే.. ఆయన ఆహారపు అలవాట్లలో కొన్ని కొత్తగా చేరేవట.. ముఖ్యంగా ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన తీసుకునే వారట ఎన్టీఆర్. మధ్యాహ్నం భోజనం తర్వాత జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగేవారట.
 

సాయంత్రం సమయంలో స్నాక్స్ గా బజ్జీలు తినటం ఎన్టీఆర్ కు అలవాటు. అలాగే డ్రైఫ్రూట్స్ ను కూడా ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారట. దానివల్ల అలసట రాదని కో ఆర్టిస్ట్ లకు తన స్నేహితులైన హీరోలకు సలహా ఇచ్చేవారట. 
 

ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజనంలో రెండు మూడు రకాల కూరలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెపుతారు. నాన్ వెజ్ అంటే ఆయనకు మహా ప్రీతి. నాటు కోడిని ఇష్టంగా లాగించేవారట. మంచి బియ్యంతో చేసిన అన్నం, కోడికూర, పెరుగు, వెజ్ లో అయినా చారు, అప్పడం ఆయన మెనూలో ఉండాల్సిందే అని చెపుతారు. 

అయితే   ఎన్టీఆర్  కొత్త ప్రాంతానికి వెళ్తే.. అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య యాత్రంలో ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారు. సౌకర్యలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు నందమూరి తారక రామారావు.

click me!