వెంకీ మూవీ షూటింగ్.. తాక కూడని చోట తాకడంతో చెంప పగలగొట్టా... అక్కడే ఉన్న సురేష్ బాబు...

First Published Jul 8, 2021, 10:43 AM IST


స్టార్ హీరోయిన్ గా 80-90లలో సౌత్ ఇండియాను ఏలారు కుష్బూ సుందర్. మహారాష్ట్రకు చెందిన కుష్బూ ముఖ్యంగా కోలీవుడ్ తిరుగులేని స్టార్డం అనుభవించారు. ఆమె అందానికి పడిపోయిన తమిళ ప్రేక్షకులు గుడికూడా కట్టి ఆరాధించారంటే అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న కుష్బూ టాలీవుడ్ ద్వారానే వెండితెరకు పరిచయమైంది. 1986లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలియుగ పాండవులు ఆమె మొదటి చిత్రం. హీరో వెంకటేష్ కూడా ఆ మూవీతోనే వెండితెర ఎంట్రీ ఇచ్చారు.
undefined
అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం ఓ ఇంటర్వ్యూలో కుష్బూ చెప్పడం జరిగింది. పరిశ్రమలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పిన ఆమె... కలియుగ పాండవులు మూవీ షూటింగ్ సమయంలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది.
undefined
ఓ విలేజ్ లో షూటింగ్ ముగిసిన తరువాత నేను మేడపైకి మెట్లు ఎక్కుతూ వెళుతున్నాను. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి నా వెనుక భాగంపై తాకాడు. కోపంతో నేను అతని చెంప పగలగొట్టాను.
undefined
ఆ ఘటన జరిగిన సమయంలో నిర్మాత సురేష్ బాబు అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు సెట్ లో ఉన్న కొందరు నాకే మద్దతుగా నిలిచారు.. అంటూ కుష్బూ తన డెబ్యూ మూవీ షూటింగ్ లో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపారు.
undefined
అలాగే ఓ టాలీవుడ్ స్టార్ హీరో తనను కమిట్ అడిగారని కుష్బూ బాంబు పేల్చారు. నీకూతురిని తమ్ముడు గదికి పంపి, అప్పుడు నేను ఒప్పుకుంటానని ఘాటు సమాధానం చెప్పినట్లు కుష్బూ తెలియజేశారు.
undefined
ఇలాంటి వేధింపులు పరిశ్రమలో ఎదురయ్యాయని కుష్బూ నిర్భయంగా బయటపెట్టారు. ఇక కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి ని 2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొలిటికల్ లీడర్ గా మారిన కుష్బూ బీజేపీలో చేరారు.
undefined
click me!