అప్పుడు లగ్జరీ కార్లు..ఇప్పుడు క్యాబ్‌.. తాను దారుణంగా మోసపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి జయలలిత ..

First Published Mar 5, 2021, 9:21 PM IST

సీనియర్‌ నటి జయలలిత లైఫ్‌లో దారుణంగా మోసపోయానని కన్నీరు మున్నీరైంది. ఒక్కసారి కారు అనేక మార్లు మోసపోతూనే ఉందట. ఒకప్పుడు లగ్జరీ కార్లల్లో తిరిగిన తాను ఇప్పుడు క్యాబ్‌ల్లో రావాల్సి వస్తుందట. దీనంతటికి కారణం ఓ విజయనగర రాజు అని చెప్పింది. తనకు జరిగిన మోసం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది జయలలిత. 

నటి జయలలిత తెలుగు, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు ఆరువందలకుపైగా చిత్రాల్లో నటించింది. వెయ్యికిపైగా నాటకాల్లో నటించింది జయలలిత. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, వ్యాంప్‌ పాత్రలు పోషించారు.
undefined
వ్యాంప్‌ పాత్రలతో, డాన్స్ లతో ఫేమ్‌ అయ్యింది జయలలిత. ఇటీవల మహేష్‌ బాబు నటించిన `భరత్‌ అనే నేను`లో స్పీకర్‌గా నటించి భావోద్వేగానికి గురయ్యింది. కొరటాలకి, మహేష్‌కి ధన్యవాదాలు తెలిపింది. వ్యాంప్‌గా చూసిన తనని ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారని ఎమోషనల్‌ అయ్యింది.
undefined
తాజాగా నటి జయలలిత.. `ఆలీతో సరదాగా`లో మరో నటి వరలక్ష్మీతో కలిసి పాల్గొంది. ఇందులో పలు షాకింగ్‌ విషయాలు తెలిపింది. తనకు వచ్చిన లవ్‌ లెటర్స్, మోసపోవడం వంటి విషయాలను తెలిపింది.
undefined
కాలేజ్‌ చదువుకునే రోజుల్లో తనకోసం కుర్రాళ్లు వెంటపడే వారని పేర్కొంది. చాలా మంది లవ్‌ లెటర్స్ రాశారని అది చూసి వాళ్ల నాన్నగారు కొట్టారని చెప్పింది. ఆ నాటి విషయాలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.
undefined
తాను పాత్ర కోసం దర్శకుడు వంశీ వద్దకు వెళ్లినప్పుడు తనకు పాత్ర లేదని, తన తండ్రికి పాత్ర ఇచ్చారని చెప్పి ఆశ్చర్యపరిచింది. క్లాసికల్‌ డాన్సర్‌గా పేరు తెచ్చుకున్న తానని వ్యాంప్‌ పాటలు, పాత్రల్లోనే బాగా ఆదరించారని చెప్పింది.
undefined
అదే సమయంలో తనకు జరిగిన మోసాన్ని వెల్లడించింది. విజయనగర రాజు ఒకరు తనని దారుణంగా మోసం చేశాడని, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు చాలా సార్లు మోసం చేశారడని, తాను అన్ని సార్లు ఎలా మోసపోయానో అర్థం కావడం లేదని తెలిపింది. ఆ విషయం తలచుకుంటే తనమీదే తనకు అసహ్యం వేస్తుందని చెప్పింది జయలలిత.
undefined
అతడు దఫదఫాలుగా తన వద్ద డబ్బు తీసుకున్నాడని, చివరికి చేతులెత్తేసి టోకరా పెట్టి వెళ్లిపోయాడని చెప్పింది. మొత్తంగా ఆ విజయనగర రాజు తన వద్ద నాలుగు కోట్లు తీసుకుని పారిపోయానని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
undefined
ఒకప్పుడు లగ్జరీ లైఫ్‌ని, స్టార్‌ హోదాని అనుభవించానని, లగ్జరీ కార్లల్లో తిరిగానని, కానీ ఇప్పుడు క్యాబ్‌లో రావాల్సిన పరిస్థితికి దిగజారానని చెబుతూ ఆలీ ముందు, వరలక్ష్మీ ముందు కన్నీరు మున్నీరైంది. ఆమెని వరలక్ష్మీ ఓదార్చారు. తాజాగా వచ్చే సోమవారం ప్రసారమయ్యే ఈ షో ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది.
undefined
దీనికి కౌంటర్‌గా మరో నటి, బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ కరాటే కళ్యాణి స్సందించారు. ఫేస్‌ బుక్‌ ద్వారా ఆమె స్పందిస్తూ, జయలలితని మోసం చేసిన వాడి పేరుని తెలిపింది. అతను అనీల్‌రాజు అని పేర్కొంది. `జయక్క నువ్వు ఎంత బాధలో ఉన్నా.. నవ్వుతూనే ఉంటావు. ఇప్పుడు కూడా అలాగే సిరిమల్లె లాగానే ఉండాలి..
undefined
అమ్మఇలా ఏడిస్తే మేము ఏమైపోతాము.. వాడు ఆ అనిల్ రాజు.. వాడి ఫ్యామిలీ దొరుకుతారు.. మనము కుమ్మెద్దాము... నీకు కష్టాలు తొందరలో పోవాలని కోరుకుంటున్నా.. ఇంకెప్పుడు... ఏడవకు నేను చూడలేను` అని పేర్కొంది కరాటే కళ్యాణి. ఈ పోస్ట్‌పై జయలలిత స్పందిస్తూ, `థాంక్యూ తల్లీ ఎమోషనల్ అయిపోయా` అని తెలిపారు.
undefined
జయలలిత పాల్గొన్న ఈ షో ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.
undefined
click me!