టాలీవుడ్ లో తీవ్ర విషాదం, సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత, కారణం ఏంటంటే?

Published : Feb 01, 2026, 05:28 PM IST

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. దాదాపు 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన తనయుడు మరణించిన కొన్ని నెలలకే ఆయన కూడా కన్నుమూయంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

PREV
12
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. గుండెపోటు కారణంగానే రఘునాథ్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణంతో తెలుగు సినిమా రంగం ఒక అనుభవజ్ఞుడైన నటుడిని కోల్పోయింది. ఈ విషయం తెలిసి తెలుగు సినీ ప్రముఖులు రఘునాథ్ రెడ్డికి సంతాపం ప్రకటిస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు..

రఘునాథ్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఆయన తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సహాయ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్‌తో పాటు నెగిటివ్ రోల్స్ లో కూడా తనదైన నటనతో మంచి పేరు సంపాదించారు. దాదాపు 370కి పైగా సినిమాల్లో నటించిన రఘునాథ్ రెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులను కూడా సాధించాడు.

22
వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా..

శోభన్ బాబు హీరోగా నటించిన ‘సర్పయాగం’ సినిమాతో రఘునాథ్ రెడ్డి నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లోనూ రఘునాథ్ రెడ్డి వందల సినిమాల్లో నటించారు. 

అన్ని భాషల్లో తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు రఘునాథ్ రెడ్డి. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో రఘునాథ్ రెడ్డి ప్రత్యేకతగా నిలిచారు.

కొడుకు మరణం తట్టుకోలేకపోయిన నటుడు..

ఈ మధ్య కాలంలోనే కొన్ని నెలల క్రితం రఘునాథ్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో మృతి చెందారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ఆ ఘటన తర్వాత ఆయన చాలా క్షోభను అనుభవించినట్లు తెలిసింది. 

అదే ఆలోచనతో రఘునాథ్ రెడ్డి ఆరోగ్యంగురించి పట్టించుకోలేదు. కుమారుడి మరణం తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి కూడా గుండె పోటుకు గురయ్యారు. నెలల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories