రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ మాట్లాడుతూ , `డీడీ నెక్ట్స్ లెవల్`తో రొటీన్గా ఉన్న హర్రర్, కామెడీ సినిమాలకు దక్కుతున్న ఆదరణ, వాటి హద్దులను చెరిపేయాలన్నదే నా లక్ష్యం. నవ్వించటంతో పాటు భయాన్ని కలిగించేలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాను.
సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్, గీతికా తివారి లాంటి అద్భుత నటులతో కలసి పని చేయడం ద్వారా నేను ఎలాంటి సినిమానైతే చేయాలనుకున్నానో రాజీపడకుండా అలాంటి చిత్రాన్ని తీశామని భావిస్తున్నా. జోనర్ సాంప్రదాయాల్ని మార్చుతూ, ప్రతి మలుపులో ఆశ్చర్యాలతో నిండిన సినిమాను తీర్చిదిద్దాం.
ఈ జర్నీ అంతా ఎంతో ఆనందంగా సాగింది. ఇలాంటి వినూత్న సినిమా డిజిటల్ ప్రీమియర్కి ZEE5 లాంటి ఉత్తమమైన వేదిక దొరకడం నిజంగా గర్వకారణం` అని అన్నారు.