అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో సమంత మిస్, అమీర్ అతిథిగా పాల్గొన్నా, రాలేదంటే వ్యవహారం చెడినట్టేనా?

First Published Sep 25, 2021, 4:53 PM IST

రోజురోజుకు సమంత(Samantha), నాగ చైతన్య(Naga chaitanya)ల విడాకుల వ్యవహారం కొత్త మలుపులు తీసుకుంటుంది. జాతీయ మీడియా సైతం ఫోకస్ పెట్టిన సామ్-చైతు వివాదంపై రోజుకో కథనం పుట్టుకు వస్తుంది. 
 

సామ్-చైతు విడిపోవడం లాంఛనమే, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. సమంత తీరు ఈ కథనాలను మరింత బలపరుస్తుంది. 

షూటింగ్స్, మీటింగ్స్ కి దూరంగా ఉంటున్న సమంత శుక్రవారం విడుదలైన లవ్ స్టోరీ చిత్రం చూడలేదు. ఒకవేళ చూసినా,  కామెంట్ చేయలేదు. కాగా అక్కినేని ఫ్యామిలీ లో జరిగిన ఓ కీలక డిన్నర్ పార్టీకి సమంత హాజరు కాలేదు.  

కొద్దిరోజుల క్రితం జరిగిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరయ్యారు. చిరు కూడా ఈ వేడుక పంచుకోగా, సినిమాకు మంచి ప్రచారం దక్కింది. 


కాగా ఈ ఈవెంట్ అనంతరం అమీర్ ఖాన్ కోసం నాగార్జున నివాసంలో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. లవ్ స్టోరీ టీమ్ సాయి పల్లవి, శేఖర్ కమ్ముల సైతం పాల్గొన్న ఈ డిన్నర్ పార్టీలో అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున, చైతు, అఖిల్ పాల్గొనడం జరిగింది. 

చెన్నైలో పేరెంట్స్ తో ఉంటున్న సమంత మాత్రం ఈ స్పెషల్ పార్టీకి హాజరు కాలేదు. ఆమె ఫ్రీగా ఉండి కూడా పార్టీకి హాజరుకాకపోవడం చైతు, సామ్ మధ్య వ్యవహారం ఏ స్థాయిలో చెడిందో అర్థం అవుతుంది. 

వరుస సంఘటనలు గమనిస్తుంటే నాగ చైతన్యతో కలిసే ఉద్దేశం సమంతకు లేదని అనిపిస్తుంది. అదే సమయంలో చైతూ కూడా అదే కోరుకుంటున్నారని భావించవచ్చు. అక్టోబర్ 6న సమంత చైతు పెళ్లి రోజు నేపథ్యంలో ఆరోజు మరింత స్పష్టత వచ్చే అవకాశం కలదు.


సమంత, చైతు మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని, కుటుంబ సభ్యుల మాట కూడా వినని ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 

click me!