సమంత పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. సమంత విడాకులకు కారణం ఇతడే అంటూ మీడియా కోడై కూసింది. సమంత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు తీసి నానా రాద్ధాంతం చేశారు. Preetham jukalker కి సోషల్ మీడియాలో వేధింపులు కూడా ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రీతమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సమంతను తాను అక్కగా భావిస్తానని, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని మీడియా ద్వారా వెల్లడించారు. అయినా సమంత, అక్కినేని అభిమానులు ప్రీతమ్ ని టార్గెట్ చేయడం మానలేదు. నిప్పులేకుండా పొగరాదంటూ, నెగిటివ్ కామెంట్స్ చేశారు.
నిజం ఏదైనా... ఇంత రచ్చ జరిగినప్పుడు ఎవరైనా కొన్నాళ్ళు దూరంగా ఉంటారు. కానీ అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది...? ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తూ, సమంత ప్రీతమ్ తో కలిసి దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు. అంతే కాకుండా ప్రీతమ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసి, దుబాయ్ వెళుతున్నట్లు కామెంట్ చేశారు.
వీరిద్దరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఉన్నారు. ఇక ఈ ట్రిప్ ద్వారా సమంత మీరు ఎన్ని అనుకున్నా నేను భయపడేది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా ద్వారా ఈ న్యూస్ బయటికి వస్తే మరింత నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే సమంత స్వయంగా చెప్పినట్లు ఉన్నారు.
ఏది ఏమైన సమంత నిర్ణయాలు సాధారణ అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి. ఇటీవల ఫ్రెండ్ శిల్పారెడ్డి తో కలిసి సమంత చార్ ధామ్ యాత్ర పూర్తి చేశారు. అంతకు ముందు గోవా, డెహ్రాడూన్ ప్రాంతాలకు శిల్పారెడ్డి ఫ్యామిలీతో కలిసి వెళ్లడం జరిగింది.
Naga chaitanyaతో విడాకులు వలన ఏర్పడిన మానసిక ఒత్తిడిని అధిగమించడానికే సమంత ఇలా టూర్స్ వేస్తున్నట్లు సమాచారం. మరో కొన్ని రోజుల్లో కొత్త సినిమాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. అందుకే సమంత, ఈ విరామ సమయాన్ని విహారాలకు ఉపయోగిస్తున్నారు.