హైదరాబాద్ లో ఫ్యాషన్ షో... అందాలతో హీటెక్కించిన ముద్దుగుమ్మలు

First Published Jul 13, 2019, 11:38 AM IST

హైదరాబాద్ లో మిర్రర్ సెలూన్స్ కొత్తగా మరో సెలూన్ ను ప్రారంభించింది. మాదాపూర్ లో సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో నూతన సెలూన్ ఏర్పాటయ్యింది. ఈ సందర్భంగా దస్ పల్లా హూటల్లో ఈ నూతన  బ్రాండ్ ఆవిష్కరణ కార్యాక్రమం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా  ప్రముఖులు హాజరయ్యారు. 

హైదరాబాద్ లో మిర్రర్ సెలూన్స్ కొత్తగా మరో సెలూన్ ను ప్రారంభించింది. మాదాపూర్ లో సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో నూతన సెలూన్ ఏర్పాటయ్యింది. ఈ సందర్భంగా దస్ పల్లా హూటల్లో ఈ నూతన బ్రాండ్ ఆవిష్కరణ కార్యాక్రమం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
undefined
ఈ సందర్భంగా నిర్వహించిన ప్యాషన్ షోలో ప్రముఖ మోడళ్లతో పాటు సీనితారలు పాలుపంచుకున్నారు. అధిరిపోయే ప్యాషన్ దుస్తుల్లో వారంతా ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ సందడిచేశారు. మూడు సీక్వెన్స్ లలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో లో సూపర్ మోడళ్ళు వయ్యారాలు పోయారు.
undefined
ఈ ఫ్యాషన్ షోలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గోల్డెన్ డ్రెస్ లో ఈ పొడుగుకాళ్ల సుందరి సుందరి ర్యాంప్ నడిచివస్తుంటే అక్కడున్నవారు కళ్లుతిప్పుకోలేకపోయారు. హొయలొలికిస్తూ ఇమె చేసిన క్యాట్ వాక్ కు వారంతా ఫిదా అయిపోయారు.
undefined
అంతేకాకుండా ప్రగ్యా జైస్వాల్, సంజన లు కూడా ఈ ప్యాషన్ షోలో పాలుపంచుకున్నారు. ప్రముఖ మోడళ్లతో పోటీ పడుతూ వీరు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.
undefined
ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సిందు కూడా పాల్గొన్నారు. ఫ్యాషనబుల్ దుస్తులను ధరించి వచ్చిన ఆమె సినీతారలు, మోడళ్లకు ఏమాత్రం తీసిపోలేదు.
undefined
ఈ సెలూన్ హెయిర్ క్రష్ బ్రాండ్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఆయనతో పాటు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ కార్చక్రమంలో పాల్గొన్నారు.
undefined
సినీ ప్రముఖులు జయసుధ, శ్రీకాంత్, నిఖిల్, సునీల్, ఆలీ, రఘు, శ్రీతేజ, మహేశ్వరి, అర్చన వేద, దీప్తి సునైనా, సామ్రాట్, శ్రీదేవి విజయ్ కుమార్, ప్రముఖ ఫాషన్ డిజైనర్ శిల్ప రెడ్డి, గీతా మాధురి లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
undefined
ప్రముఖ నటుడు రాజశేఖర్ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. భార్య జీవిత, కూతురు శివాత్మికను వెంటబెట్టుకుని హాజరైన ఆయన ఫోటోలకు పోజులిచ్చారు.
undefined
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు విజయ లక్ష్మి మాట్లాడుతూ...మధ్య తరగతి మహిళలకు బ్యూటి సేవలు అందించాలనే ఉదేశ్యంతో ఈ సెలూన్ హెయిర్ క్రష్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.
undefined
click me!